Meenakshi Natarajan: ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం ఉదయం చర్లపల్లి రైల్వే స్వేషన్ (Cherlapalli Railway station) నుంచి ప్రత్యేక రైలులో ఆమె బీసీ నేతలతో కలిసి వెళ్లారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకు టీపీసీసీ ఉద్యమం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాలు, బీసీ నేతలంతా హస్తిన బాట పట్టారు. ఇక ఢిల్లీలో మూడు రోజుల ప్రత్యేక ఉద్యమ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
Also Read: Guvvala Balaraju: గులాబీని ఖాళీ చేసేలా కమలం స్కెచ్.. లోకల్కు ముందే దెబ్బకొటేలా ప్లాన్
ఆగస్టు 5న పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించేందుకు వాయిదా తీర్మానానికి టీపీసీసీ నేతలు పోరాటం చేయనున్నారు. ఆగస్టు 6న జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా భారీ ధర్నా నిర్వహించనున్నారు. దీంతో తెలంగాణ నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొననున్నారు. ఇక ఆగస్టు7న తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతికి సమర్పిస్తూ వినతిపత్రాలు అందజేయనున్నారు. ప్రతి జిల్లా నుంచి 25 మంది కీలక నేతలు ట్రైన్లో వెళ్లినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.