Nagarjuna Sagar: తెలంగాణకు అప్పగిస్తూ కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు
Nagarjuna Sagar (imagecredit:twitter)
Telangana News

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ తెలంగాణకు అప్పగిస్తూ కేఆర్‌ఎంబీ ఉత్తర్వులు

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ ప్రాజెక్టు(Nagarjunasagar Project) తెలంగాణ(Telangana) పర్యవేక్షణలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టును తాత్కాలికంగా తెలంగాణ చేతికి అప్పగిస్తూ కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు(KRMB) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్లో డ్యామ్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ (నిర్వహణ) కోసమే ఈ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ వరద సీజన్ మొత్తం ప్రాజెక్టు బాధ్యతలను చూసేలా తెలంగాణ(Telangana)కు అనుమతులు ఇచ్చింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అధికారులు సాగర్ డ్యామ్ నిర్వహణను పర్యవేక్షించనున్నారు. సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరదలు వస్తుండటంతో ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తారు.

డ్యామ్‌పైకి అధికారులను అనుమతి
ఈ నేపథ్యంలో స్పిల్‌వే గేట్లతో పాటు అక్కడ మెకానికల్ వ్యవహారాలను తెలంగాణ(Telangana) చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్టు ఆపరేషన్స్‌కు డ్యామ్‌పైకి అధికారులను అనుమతించాలంటూ ఈ నెల 17వ తేదీనే కృష్ణా బోర్డు(Krishna Board)కు ఈఎన్‌సీ జనరల్ అంజద్ హుస్సేన్(Anjad Hussain) లేఖ రాశారు. స్పిల్‌వే గేట్ల నిర్వహణను చూడాల్సి ఉండడం, సేఫ్టీ ప్రొటోకాల్స్ పాటించాల్సి ఉండడంతో తమ అధికారులను నిత్యం డ్యామ్‌పైకి అనుమతించాలని ఆ లేఖలో ఈఎన్‌సీ(ENC) కోరారు. అందుకు అనుగుణంగా డ్యామ్ వద్ద విధులు నిర్వహించే అధికారుల జాబితాను పంపారు.

Also Read; CM Revanth Reddy: సీఎం సంతకం తర్వాత.. అన్ని కేటగిరీల వారికి పదోన్నతులు

ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ వైపు
వర్షాకాలం కావడంతో అధికారులు షిఫ్టుల వారీగా రాత్రింబవళ్లు విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని, అందుకు డ్యామ్‌పైకి వెళ్లాల్సి ఉంటుందని బోర్డుకు ఈఎన్‌సీ(ENC) వివరించారు. కొందరు ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్(AP) వైపు నివసిస్తున్నారని, హిల్ కాలనీలోని ఆఫీసుకు రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తుందని, దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో విధులకు ఆటంకం కలగకుండా, డ్యామ్ మెయింటెనెన్స్‌ను సమర్థంగా నిర్వహించడానికి అధికారులను డ్యామ్‌పై నుంచి అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అందుకు కృష్ణా బోర్డు(Krshna Board) ఆమోదం తెలిపింది.

Also Read: Vikarabad district: అభివృద్ధి ప్రజా సంక్షేమమే పార్టీ ధ్యేయం: బట్టి విక్రమార్క

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం