Terrorist Organizations: పేలుళ్లతోపాటు ఆత్మాహుతి దాడులకు కుట్ర చేసిన సిరాజ్, సమీర్తదితరుల వెనక నిషేధిత ఉగ్రవాద సంస్థలు పాపులర్ ఫ్రంట్ఆఫ్ ఇండియా హిజ్బుత్తెహ్రీర్ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ రెండు సంస్థలకు చెందిన హ్యాండ్లర్లే సిరాజ్, సమీర్ లతో అల్హింద్ఇత్తెహాదుల్ముస్లిమీన్గ్రూప్ను మొదలు పెట్టించినట్టుగా సమాచారం. ఇస్లామిక్ రాజ్య(షరియా) స్థాపనే లక్ష్యమని ఈ ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే ప్రకటించటం విచారణలో సిరాజ్, సమీర్లు ఇదే విషయాన్ని చెప్పటం గమనార్హం. నిఘా వర్గాలు కూడా ఈ విషయాన్ని నిర్ధారిస్తున్నాయి.
50 దేశాల్లో
కౌంటర్ ఇంటెలిజెన్స్విభాగానికి చెందిన ఓ అధికారి తెలిపిన ప్రకారం హిజ్బుత్ తెహ్రీర్సంస్థ 30కి పైగా దేశాల్లో విస్తరించి ఉంది. వీటిలో సౌదీ, ఒమన్కూడా ఉన్నాయి. అధికారులు చెబుతున్న ప్రకారం ఇస్లామిక్స్టేట్ఆఫ్ఇరాక్అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) కన్నా ఇది ప్రమాదకరమైంది. ఈ సంస్థకు చెందిన హ్యాండ్లర్లు సోషల్మీడియా ద్వారా మత దురభిమానం ఉన్న యువకులను గుర్తించి వారి టచ్లోకి వెళుతుంటారు. వేర్వేరు ప్లాట్ఫాంల ద్వారా ఛాటింగ్ మొదలు పెడతారు. రెచ్చగొట్టే ప్రసంగాలు వీడియోల క్లిప్పింగులను పంపించి యువకులను జిహాద్ బాటలోకి నడిపిస్తారు.
ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ సంస్థలో ప్రత్యేకంగా ఆర్మ్ డ్ వింగ్ ఉండటం. ఈ వింగ్ లో ఉన్న వారు జిహాద్ వైపు ఆకర్షితులైన యువకులకు బాంబులు ఎలా తయారు చేయాలి? ఆయుధాలను ఎలా ఉపయోగించాలి? అన్న దారిపై తర్ఫీదు ఇస్తుంటారని ఆ అధికారి చెప్పారు. దాంతోపాటు బ్యాక్టిరియాలాజికల్, బయోలాజికల్ వార్ లోనూ ట్రైనింగ్ ఇస్తుంటారన్నారు. ఈ సంస్థ నెట్వర్క్ మన దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో విస్తరించి ఉందన్నారు. దాదాపు రెండేళ్ల క్రితం భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నపుడు ఈ సంస్థ కార్యకలాపాలు వెలుగు చూశాయన్నారు. ఇస్లామిక్రాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఈ సంస్థ పలుమార్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
Also Read: KTR on CM Revanth: బీఆర్ఎస్ లో రేవంత్ కోవర్టులు.. కేటీఆర్ సంచలన కామెంట్స్!
అలజడులు సృష్టించటమే టార్గెట్
ఇక, కేంద్ర ప్రభుత్వం నిషేధించిన ఉగ్ర సంస్థల జాబితాలో ఉన్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా లక్ష్యం కూడా ఇస్లామిక్ రాజ్య స్థాపనే కావటం గమనార్హం. కేరళలో పుట్టిన ఈ సంస్థకు దేశవ్యాప్తంగా నెట్వర్క్ ఉంది. తెలంగాణతోపాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ సంస్థకు చెందినవారు పదుల సంఖ్యలో ఉన్నారని నిఘా వర్గాలు చెబుతున్నాయి. రెచ్చగొట్టటం ద్వారా యువకులను ఉగ్రవాదం బాటలోకి నడిపించి అలజడులు సృష్టించటమే టార్గెట్ గా ఈ సంస్థ పని చేస్తోందని తెలిపాయి. గమనించాల్సిన అంశం ఏమిటంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ఇండియాకు చెందిన ఉగ్రవాదులు భారీ పేలుళ్లు సృష్టించటంతోపాటు లక్ష్యంగా చేసుకున్న రాజకీయ నాయకులు, ఆర్ఎస్ఎస్ నేతలను హత్యలు చేయటానికి పన్నాగాలు పన్నటం. దీని కోసం యువకులకు కత్తులు, డాకర్లను ఉపయోగించి ఎలా దాడులు జరపాలి? శరీరంలోని ఏ భాగంలో పొడిస్తే వెంటనే మనిషి చనిపోతాడన్న దానిపై కొందరు యువకులకు శిక్షణ ఇచ్చినట్టు భోపాల్ మాడ్యూల్ లోని కొందరు ఉగ్రవాదులను అరెస్టు చేసినపుడు వెలుగు చూడటం గమనార్హం.
ఇస్లామిక్రాజ్య స్థాపనే లక్ష్యం
తాజాగా పేలుళ్ల కుట్రలో పట్టుబడ్డ సిరాజ్, సమీర్ల వెనక ఈ రెండు సంస్థలే ఉన్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో ఇస్లామిక్రాజ్య స్థాపనే తమ లక్ష్యమని సిరాజ్, సమీర్లు చెప్పటం గమనార్హం. దాంతోపాటు కొంతమంది ఆర్ఎస్ఎస్ నాయకులను టార్గెట్ చేసినట్టుగా చెప్పటం, హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా పేలుళ్లు జరపాలని పన్నాగాలు పన్నినట్టు వెల్లడించటం వీటికి బలాన్ని చేకూరుస్తున్నాయి. నిజానికి హిజ్బుత్ తెహ్రీర్, పాపులర్ఫ్రంట్ఆఫ్ ఇండియా కలిసి పని చేస్తున్నట్టుగా కూడా తమకు అనుమానాలు ఉన్నట్టు నిఘా విభాగానికి చెందిన ఓ సీనియర్ అధికారి చెప్పారు. సిరాజ్, సమీర్ ల విచారణలో దీనికి సంబంధించి కీలక వివరాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నాయన్నారు.
Also Read: Panchayat Raj Jobs: పంచాయతీ రాజ్ లో ప్రమోషన్లకు మోక్షం కలిగేనా?