Nagarjuna Sagar (Image Source: Twitter)
తెలంగాణ

Nagarjuna Sagar: సాగర్ డ్యామ్‌పై లొల్లి.. ఏపీ, తెలంగాణ ఉద్యోగుల మధ్య వాగ్వాదం.. ఎందుకంటే?

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ డ్యాంపై తెలంగాణ, ఏపీ అధికారుల మధ్య వాగ్వాదం జరిగింది. డ్యాంను తమకు అప్పగించాలని ఏపీ పట్టుబట్టడంతో తెలంగాణ అధికారులు సైతం స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్​ఎంబీ) ఉద్యోగుల ఇన్సెంటివ్స్‌పై స్పెషల్​ మీటింగ్ నిర్వహించారు. వర్చువల్ విధానంలో ఏపీ, తెలంగాణ అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో సాగర్​ డ్యామ్​ యాజమాన్య నిర్వహణ అంశంను తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. విభజన చట్టం ప్రకారం కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు నిర్వహిస్తున్నా, శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ, నాగార్జునసాగర్​ ప్రాజెక్ట్‌​ను తెలంగాణ నిర్వహించాల్సి ఉంది. శ్రీశైలం ఏపీ ఆధీనంలోనే ఉంది. సాగర్​ డ్యామ్‌పై ఏపీ వితండవాదం చేస్తుంది. అంతేకాదు ఏపీ తీరుతో కేంద్రం సీఆర్​పీఎఫ్​ బలగాలను మోహరించిన విషయం తెలిసిందే. సాగర్​ డ్యాం​ను తెలంగాణకు అప్పగించాలని కృష్ణా బోర్డు మీటింగులలో కోరుతున్నారు. ఈ మీటింగ్​‌లోనూ డ్యామ్‌​ను తెలంగాణకు అప్పగించాల్సిందేనని డిమాండ్ చేశారు.

ఏపీ మాత్రం అప్పగించేది లేదంటూ చెప్పడంతో పాటు తామే నిర్వహిస్తామని, తమ స్పెషల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​ (ఎస్పీఎఫ్​)ను పెట్టుకుంటామని బోర్డు ముందు వాదించింది. దీంతో తెలంగాణ అధికారులు ఏపీకి గట్టిగానే కౌంటర్​ ఇచ్చారు. విభజన చట్టం ప్రకారం శ్రీశైలం డ్యామ్​ ఏపీ చేతుల్లో ఉన్నప్పుడు, సాగర్​ ప్రాజెక్టు నిర్వహణ తెలంగాణనే కదా చూడాల్సిందని బోర్డుకు వివరించారు. తెలంగాణ ప్రతిపాదనకు తొలుత కృష్ణా బోర్డు చైర్మన్​ అతుల్​ జైన్​ స్పందించారు. సాగర్​ డ్యామ్​ నిర్వహణను తెలంగాణనే చూసుకోవాల్సి ఉంటుంది కదా అన్నారు. ఏపీ అధికారులు జోక్యం చేసుకుని అదెలా సాధ్యమని అడ్డుకున్నారు. ఎస్​పీఎఫ్‌కు ఇవ్వకపోయినా, ప్రస్తుతం సీఆర్​పీఎఫ్​ అధీనంలోనే ఉందని దానినే కొనసాగించాలని బోర్డును కోరారు. దీనికి బోర్డు చైర్మన్​ కూడా దానికి అంగీకరించారు.

Also Read: Raghunandan on Kavitha: నన్నెందుకు విచారణకు పిలవడం లేదు.. ఎంపీ రఘునందన్ రావు

డిసెంబర్​ 30 వరకు సాగర్​ ప్రాజెక్ట్​ నిర్వహణ సీఆర్​పీఎఫ్​ అధీనంలోనే ఉంటుందని, అప్పటి వరకూ అదే కొనసాగుతుందని బోర్డు చైర్మన్​ పేర్కొన్నారు. తెలంగాణకు సాగర్ ప్రాజెక్టును అప్పగిస్తే తమ ఆటలు సాగవనే ఏపీ అడ్డుకుంటుందని అధికారులు కుట్రలకు పాల్పడుతున్నారనేది స్పష్టమవుతున్నది. అయితే, బోర్డులో పనిచేస్తున్న తెలంగాణ, ఆంధ్ర ఉద్యోగులకు ఇకపై స్పెషల్​ ఇన్సెంటివ్స్​ ఇవ్వొద్దని సమావేశంలో నిర్ణయించారు. కేంద్ర జలశక్తిశాఖ గైడ్‍లైన్స్, హైకోర్టు ఆదేశాలపై భేటీలో చర్చించారు. ఇప్పటికే ఇచ్చిన ఇన్సెంటివ్స్​‌ను రికవరీ చేయాలని కేంద్రం ఆదేశాలివ్వగా, రికవరీ చేయాల్సిన అవసరం లేదని నిర్ణయించినట్టు అధికారులు పేర్కొంటున్నారు.

Also Read This: IAMC: ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ భూములా?.. అదికూడా ప్రైమ్ ఏరియాలో..

Just In

01

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు