Notices to Smita Sabharwal (imagecredit:twitter)
తెలంగాణ

Notices to Smita Sabharwal: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై.. ఓ ఐఏఎస్ అధికారికి నోటీసులు!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Notices to Smita Sabharwal: కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి సోషల్​ మీడియాలో అప్ లోడ్​ అయిన ఫేక్ పోస్టుల విషయంలో దర్యాప్తును ముమ్మరం చేసిన గచ్చిబౌలి పోలీసులు ఐఏఎస్​ అధికారి స్మతి సబర్వాల్​ కు నోటీసులు జారీ చేశారు. బీఎన్​ఎస్​ 179 సెక్షన్​ ప్రకారం జారీ చేసిన ఈ నోటీసులో విచారణకు హాజరు కావాలని పేర్కొన్నారు. కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆ భూముల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరపటానికి శ్రీకారం చుట్టింది. అయితే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు అభివృద్ధి పేర చెట్లను నరికి వేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు.

ఈ భూముల్లో నెమళ్లు, జింకలు ఉన్నాయని, చెట్లను నరకటం వల్ల అవి జనావాసాల్లోకి వెళుతున్నాయన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సోషల్​ మీడియాలో కంచ గచ్చిబౌలి భూముల్లో నెమళ్లు, జింకలు ఉన్నట్టుగా, చెట్లను నరకటం వల్ల వాటి ఉనికి ప్రమాదం ఏర్పడినట్టుగా పెద్ద సంఖ్యలో ఫోటోలు, వీడియోలు అప్​ లోడ్​ అయ్యాయి. ఇలా పోస్టులు పెట్టిన వారిలో బీఆర్​ఎస్ నాయకులు క్రిశాంక్​, కొణతం దిలీప్​ తోపాటు 25మంది సెలబ్రెటీలు, ఇంకా కొంతమంది ఉన్నట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

Also Read: MP Kishan Reddy: కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీలో దుమారం.. ఇన్‌చార్జ్ ఎవరు? బీజేపీలో తర్జన భర్జన!

ఇక, సోషల్​ మీడియాలో అప్​ లోడ్​ చేసిన ఫోటోలు, వీడియోలు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ సహాయంతో రూపొందించినవని తేలింది. ఈ మేరకు ఫిర్యాదులు అందటంతో గచ్చిబౌలి పోలీసులు బీఆర్​ఎస్​ నాయకులు క్రిశాంక్, దిలీప్​ లతోపాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంటూ కేసులు నమోదు చేశారు. ఇద్దరికీ నోటీసులు ఇచ్చి పోలీస్​ స్టేషన్​ కు పిలిపించి విచారణ జరిపారు.

రీ పోస్ట్​…

గత నెల 31న హాయ్​ హైదరాబాద్​ అన్న హ్యాండిల్​ నుంచి ఎక్స్​ లో కంచ గచ్చిబౌలిలో ఉన్న మష్రూమ్​ రాక్ ముందు పెద్ద సంఖ్యలో బుల్​ డోజర్లు, వాటి ముందు నెమళ్లు, జింకలు ఉన్నట్టుగా గిబ్లీ ఇమేజ్​ అప్​ లోడ్​ అయ్యింది. దీనిని ఐఏఎస్​ అధికారిణి స్మితా సబర్వాల్​ రీ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఇమేజ్​ పై పోలీసులు జరిపిన విచారణలో అది ఫేక్​ ఫోటో అని తేలింది. ఈ క్రమంలోనే స్మితా సబర్వాల్ కు నోటీసులు జారీ చేసినట్టుగా సీఐ మహ్మద్​ హబీబుల్లా ఖాన్​ తెలిపారు.

బీఎన్​ఎస్​ 179 సెక్షన్​ ప్రకారం నోటీసు జారీ చేసి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారి వాంగ్మూలాలను నమోదు చేయవచ్చన్నారు. కాగా, ఈ నోటీసుపై స్మితా సబర్వాల్​ ఎలా స్పందిస్తారన్నది ప్రస్తుతం చర్చనీయంగా మారింది.

Also Read: స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?