High Court Verdict: వంద గ్రాములకు మించి మాదక ద్రవ్యాలతో పట్టుబడితే తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని హైకోర్టు అభిప్రాయ పడింది. మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ఈ అంశాన్ని స్పష్టంగా చెబుతోందని పేర్కొంది. కల్తీ కల్లు తయారీలో ఉపయోగించే 132 కిలోల ఆల్ఫాజోలెంతో దోషిగా తేలిన వ్యక్తి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా జిన్నారం అనంతారం గ్రామంలోని వెంకట రాఘవ ల్యాబ్స్ లో బండారు హనుమంత రెడ్డి, వాసంశెట్టి నరేశ్ మరికొందరితో కలిసి ఆల్ఫాజోలెం ఉత్పత్తి చేస్తున్నట్టు తెలిసి 2018లో దాడి చేశారు.
Also Read: Rajanna Sircilla: ఇదేం పెళ్లిరా బాబూ.. ఇన్ని ట్విస్టులా.. సినిమాల్లోనూ చూడలే!
నిందితులను అరెస్ట్ చేసి 132 కిలో ఆల్పాజోలెంతోపాటు యంత్రాలు, రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును విచారించిన సంగారెడ్డి కోర్టు నిందితులకు పదేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా, దీనిపై వాసంశెట్టి నరేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కే.లక్ష్మణ్ ధర్మాసనం మాదక ద్రవ్యాల నిరోధక చట్టం ప్రకారం 100 గ్రాములకన్నా ఎక్కువ మాదక ద్రవ్యాలతో దొరికితే తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇలాంటి కేసుల్లో బెయిల్ ఇవ్వటానికి కోర్టులో సుముఖత వ్యక్తం చేయవని వ్యాఖ్యానించింది.
Also Read: Tummala Nageswara Rao: గిరిజన జిల్లాను అభివృద్ధిలో.. నవ కాంతులతో ముందుకు తీసుకువెళ్తాం!