Miss World Contestants: బుద్ధవనం సందర్శించనున్న మిస్ వరల్డ్స్.
Miss World Contestants (imagecredit:swetcha)
Telangana News

Miss World Contestants: నేడు బుద్ధవనం సందర్శించనున్న మిస్ వరల్డ్ పోటీదారులు!

Miss World Contestants: తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనేందుకు వచ్చిన కొంతమంది పోటీ దారులు నాగార్జునసాగర్ సమీపంలో ఉన్న బుద్ధవనంను సందర్శించనున్నారు. బుద్దవనంలో ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. సుమారు 30 దేశాలకు చెందిన ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొనే పోటీదారులు సందర్శించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి నల్గొండ జిల్లా, చింతపల్లి సమీపంలో ఉన్న అతిథి గృహం వద్ద కాసేపు ఆగుతారు.

అనంతరం అక్కడి నుంచి బయలుదేరి విజయ్ విహార్ చేరుకుంటారు. అక్కడ ఫొటో సెషన్ తర్వాత బుద్ధవనం చేరుకుంటారు. సుమారు 24 మంది లంబాడా కళాకారులు నృత్యంతో వారికి స్వాగతం పలకనున్నారు. మహా స్థూపం వద్ద స్వాగతం అనంతరం స్థూపం కనిపించేలా ఫొటో సెషన్ ఉంటుంది. ఇందుకు గాను అవసరమైన ఏర్పాట్లు అధికారులు చేశారు. అక్కడి నుంచి మహా స్థూపంలోకి ప్రవేశించిన తర్వాత మహా స్థూపానికి సంబంధించిన వివరాలను పురావస్తు శాఖ ప్రతినిధులు వివరించనున్నారు.

Also Read: Drugs: నమ్రత డ్రగ్స్ కేసులో బయటపడ్డ సంచలన విషయాలు.. అవేంటంటే!

అక్కడే ప్రపంచ సుందరీమణులు ధ్యానం తర్వాత ఇక్కడే 25 మంది బౌద్ధ సన్యాసులు బైలికుప్ప మహా బోధి పూజలు నిర్వహిస్తారు. అనంతరం జాతక వనాన్ని సందర్శిస్తారు. బుద్ధవనం ప్రాముఖ్యతను పురావస్తు, టూరిజమ్ ప్రతినిధి శివనాగిరెడ్డి ప్రపంచ సుందరీమణులకు వివరిస్తారు. జాతక వనం సందర్శన అనంతరం బుద్ధ చరితం పై 18 మంది కళాకారులు ఇచ్చే ప్రదర్శనను తిలకిస్తారు. రాత్రి భోజనం అనంతరం తర్వాత తిరిగి హైదరాబాద్ కు చేరుకుంటారు.

 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?