Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి
Kodanda Reddy ( image credit: twitter)
Telangana News

Kodanda Reddy: రైతులకు పక్కా రసీదులు ఇవ్వాలి.. రైతుకమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

Kodanda Reddy: ధాన్యం కొనుగోలు కేంద్రాల వ‌ద్ద రైతుల‌కు ప‌క్కా ర‌సీదులు ఇవ్వకుండా అధికారులు ఇబ్బంది పెడ్తున్నారని రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో బుధవారం మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డితో రైతు క‌మిష‌న్ బృందం భేటి అయింది. ధాన్యం కొనుగోళ్లలో రైతులు ప‌డ్తున్న ఇబ్బందుల‌ను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ ఇక‌ తూకం వేసిన ధాన్యాన్ని లారీల ద్వారా రైస్ మిల్లుల‌కు పంపిస్తున్నారని, అయితే రైస్ మిల్లుల్లో ధాన్యం దించే వ‌ర‌కు రైతుల‌ను బాధ్యులుగా చేయ‌డం స‌రైంది కాద‌న్నారు.

Also Read: Kodanda Reddy: రైతులు చిరుధాన్యాలు సాగు చేయాలి.. కోదండ రెడ్డి కీలక వ్యాఖ్యలు

రైతు క‌మిష‌న్ కు ఫిర్యాదులు

చాలా ప్రాంతాల నుంచి రైతులు ఈ విష‌యంపై రైతు క‌మిష‌న్ కు ఫిర్యాదులు చేశారన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సివిల్ స‌ప్ల‌య్ క‌మిష‌నర్ స్టీఫెన్ ర‌వీంద్ర‌కు ఫోన్ చేసి ఇలాంటివి మ‌రో సారి జ‌ర‌గ‌కుండా చూసుకోవాల‌ని ఆదేశాలిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా రైతుల‌కు క‌నీస వ‌స‌తులు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. కార్యక్రమంలో క‌మిష‌న్ స‌భ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి తదితరులున్నారు.

Also Read: Kodanda Reddy: రైతు ర్యాయితీలకు పూసగింజలు .. ఉద్యానవన పంటలకు కొత్త వెలుగు.. రైతు కమిషన్ చైర్మన్

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?