Ganja Seized: తెలంగాణలో డ్రగ్ మాఫియా పై ..ఎక్సైజ్ గట్టిదెబ్బ!
Ganja Seized [IMAGE CREDIT; twitter]
Telangana News

Ganja Seized: తెలంగాణలో డ్రగ్ మాఫియా పై ..ఎక్సైజ్ గట్టిదెబ్బ!

Ganja Seized:వేర్వేరు చోట్ల దాడులు జరిపి గంజాయి అమ్ముతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఎక్సయిజ్ స్టేట్​ టాస్క్​ ఫోర్స్ అధికారులు 26.7 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులతో సంబంధం ఉన్న మరో తొమ్మిది మందిపై కూడా కేసులు నమోదు చేశారు. ఎక్సయిజ్​ ఎన్​ ఫోర్స్​ మెంట్​ డైరెక్టర్​ వీ.బీ.కమలాసన్ రెడ్డ తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధూల్​ పేట నివాసి ఆకాశ్​ సింగ్​ ఒడిషా రాష్ట్రం నుంచి 25 కిలోల గంజాయిని తెప్పించుకున్నాడు.

దీనిని ద్విచక్ర వాహనంపై తీసుకెళుతుండగా ఎక్సయిజ్ టాస్క్​ ఫోర్స్​ బీ టీం సీఐ అంజిరెడ్డి సిబ్బందితో కలిసి ధూల్​ పేట అవంతిబాయి విగ్రహం వద్ద పట్టుకున్నారు. ఆకాశ్​ సింగ్​ పై కేసులు నమోదు చేసి ధూల్​ పేట ఎక్సయిజ్​ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఈ కేసుతో లఖన్​ సింగ్​, సంజయ్​ సింగ్​, జ్యోతిబాయి, ఆనంద్​ సింగ్​, మనష్​ సింగ్​, దీప, నిరంజన్​ కుమార్​ లకు కూడా సంబంధం ఉన్నట్టు తేలటంతో వారిపై కూడా కేసులు పెట్టారు.

  Also Read: Hyderabad Metro: హైదరాబాద్ రెండో దశ మెట్రోకు జైకా సహకారం.. ఫలించిన సీఎం చొరవ!

ప్రస్తుతం పరారీలో ఉన్న వీరి కోసం గాలిస్తున్నారు. ఇక, జియాగూడ ప్రాంతంలోని కాశీ శివమందిర్​ వద్ద గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్టు తెలిసి ఎక్సయిజ్​ టాస్క్​ ఫోర్స్ పోలీసులు దాడి చేసి బద్రీనారాయణ్​ సింగ్ ను అరెస్ట్​ చేశారు. అతని వద్ద నుంచి 1.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుతో బంగ్లావాలా అజయ్​ సింగ్​, మంజూదేవిలకు సంబంధం ఉన్నట్టు విచారణలో తెలియటంతో వారిపై కూడా కేసులు పెట్టారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?