Chinese Manja: చైనా మాంజా విక్రయాలను అరికట్టాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం సీఐ సత్యనారాయణకు వినతి పత్రం సమర్పించారు. మేడ్చల్ పట్టణం, పరిసర గ్రామాల్లో నైలాన్ మాంజాను అక్రమంగా విక్రయిస్తున్నారన్నారు. ఈ మాంజా కారణంగా ద్విచక్ర వాహనదారులు, పాదాచారులు, చిన్న పిల్లలు, పక్షులు, జంతువులకు గాయాలు అవుతున్నాయని, ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉందన్నారు. అక్రమంగా మాంజాలను విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకొని, విక్రయాలను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మన్నె ప్రశాంత్, సహాయ కార్యదర్శి నర్సింగరావు, మండల అధ్యక్ష, కార్యదర్శులు బాల కిరణ్, రంజిత్, నాయకులు శ్రీకాంత్, అఖిల్, విఠల్ తదితరులు పాల్గొన్నారు.

