Bhatti Vikramarka: విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదు?
TG ( Image source: Twitter)
Telangana News

Bhatti Vikramarka: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గిరిజన బాలికల గురుకుల పాఠశాల ఆకస్మిక తనిఖీ

Bhatti Vikramarka: వైరా నియోజకవర్గం ముసలిమడుగు గ్రామంలోని తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థినులతో ముచ్చటించారు. అధ్యాపకులు బోధిస్తున్న పాఠ్యాంశాలు అర్ధమవుతున్నాయా? మీరు బాగా చదువుతున్నారు? మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి? డైట్ చార్ట్ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? అని బాలికలను ఉప ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

Also Read: Huzurabad Crime News: గర్భిణి హత్య కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు.. సంచలన నిజాలు వెలుగులోకి?

ఈ సందర్భంగా బాలికలు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం నిర్ణయించిన డైట్ మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారని చెప్పారు. ప్రతిరోజు గుడ్డు, అదేవిధంగా చార్ట్ ప్రకారం చికెన్, మాంసాహార వంటలను అందిస్తున్నారని చెప్పారు. పాఠ్యాంశాలను అధ్యాపకులు చక్కగా బోధిస్తున్నారని స్టడీ అవర్స్ లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎప్పటికప్పుడు సందేహాలను నివృత్తి చేస్తూ చదువు చెబుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గురుకుల పాఠశాలలోని తరగతి గదులను, వంటశాలని తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు విద్యార్థినులకు డైట్ మెనూతో పాటు బాలికలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటుగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Also Read: Adwait Kumar Singh: విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి.. జిల్లా కలెక్టర్ అద్వైత్ సింగ్ కీలక అదేశాలు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..