Cyber Criminals Arrest: రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు సైబర్ క్రిమినల్స్ పై పంజా విసిరారు. పది రోజులపాటు గుజరాత్ లో స్పెషల్ ఆపరేషన్ జరిపిన రెండు బృందాలు దేశవ్యాప్తంగా 515 సైబర్ మోసాలకు పాల్పడిన 20మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. ఒక్క మన రాష్ట్రంలోనే నిందితులు 60 నేరాలు చేసినట్టుగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ డీజీ షిఖా గోయల్ తెలిపారు.
ఏయేటికాయేడు పెరిగిపోతున్న సైబర్ మోసాలకు కళ్లెం వేయటానికి రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో పటిష్ట చర్యలకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఆయా కేసుల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బుకు సంబంధించిన లావాదేవీలపై నిఘా పెట్టారు.
Alos Read: Ganja Seized: ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ దాడులు.. 53 లక్షల విలువైన గంజాయి సీజ్!
సైబర్ క్రిమినల్స్ ఏయే బ్యాంకుల నుంచి డబ్బు విత్ డ్రా చేశారు? ఆయా ఖాతాల వివరాలను తెలుసుకున్నారు. ఇలా పక్కగా సమాచారాన్ని సేకరించిన అనంతరం సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీఎస్పీలు ఫణీందర్, రంగారెడ్డిల నేతృత్వంలో సీఐలు మహేందర్, రవికుమార్ లతో కూడిన రెండు బృందాలు గుజరాత్ రాష్ట్రం సూరత్ కు ఈనెల 1న వెళ్లాయి. ఎస్పీ దేవేందర్ సింగ్, డిప్యూటీ సూపరిండింటెంట్లు సూర్యప్రకాశ్, హరికృష్ణల పర్యవేక్షణలో విచారణ చేపట్టాయి.
ఈ క్రమంలో సైబర్ క్రిమినల్స్ కు బ్యాంక్ ఖాతాలను సమకూర్చిన 14మందితోపాటు ఏజెంట్లుగా వ్యవహరించిన మరో 6గురిని అరెస్ట్ చేశాయి. మొత్తం 27 బ్యాంక్ ఖాతాల ద్వారా నిందితులు 4.37కోట్ల రూపాయలను విత్ డ్రా చేసినట్టుగా గుర్తించాయి. ఒక్క తెలంగాణలో నమోదైన 5 కేసుల్లో 22.64లక్షల రూపాయలను చెక్కుల ద్వారా విత్ డ్రా చేసినట్టుగా నిర్ధారించుకున్నాయి. అరెస్ట్ చేసిన నిందితుల్లో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు, గుజరాత్ రాష్ట్రం వాపీ బ్రాంచ్ డీసీబీ బ్యాంకులో రిలేషన్ షిప్ మేనేజర్ గా పని చేస్తున్న ఉద్యోగి ఉండటం గమనార్హం.
Also Read: Ganja Seized: ఎక్సయిజ్ టాస్క్ ఫోర్స్ దాడులు.. 53 లక్షల విలువైన గంజాయి సీజ్!
ఇన్వెస్ట్ మెంట్, ట్రేడింగ్ ఫ్రాడ్లతోపాటు పార్ట్ టైం ఉద్యోగాల పేర సైబర్ మోసగాళ్లు నేరాలు చేసినట్టుగా వెల్లడైంది. వీరి నుంచి 20 మొబైల్ ఫోన్లు, 28 సిమ్ కార్డులు, 4 ఏటీఎం కార్డులు, 5 చెక్ బుక్కులు, 2 పాన్ కార్డులు, 2 రబ్బర్ స్టాంపులతోపాటు పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు.