DGP Shivadhar Reddy: సైబర్ నేరాల కట్టడిలో మనమే నెంబర్​ వన్
DGP Shivadhar Reddy ( image CREDIT: SWETCHA REPORTER)
Telangana News

DGP Shivadhar Reddy: సైబర్ నేరాల కట్టడిలో మనమే నెంబర్​ వన్.. ఫ్రాడ్​ కా ఫుల్​ స్టాప్​ కార్యక్రమంలో డీజీపీ శివధర్ రెడ్డి

DGP Shivadhar Reddy: సంప్రదాయ నేరాలు తగ్గుముఖం పడుతున్నా ఏయేటికాయేడు సైబర్​ క్రైమ్స్​ పెరిగిపోతున్నాయని డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) అన్నారు. వీటిని అరికట్టడంలో దేశంలోనే రాష్ట్రం అగ్ర స్థానంలో ఉన్నా మరిన్ని పటిష్టమైన చర్య​లు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఎక్కడో వందలు వేల మైళ్ల దూరంలో కూర్చుని జనం కష్టార్జితాన్ని కొల్లగొడుతున్న సైబర్​ క్రిమినల్స్‌కు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని చెప్పారు. బంజారాహిల్స్​‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో మంగళవారం డీజీపీ శివధర్ రెడ్డి ‘ఫ్రాడ్​ కా ఫుల్‌స్టాప్​’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సైబర్ నేరాల కట్టడికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి

ఫ్రాడ్​ కా ఫుల్‌స్టాప్​ కార్యక్రమంలో భాగంగా నిర్వహించనున్న ఆరు వారాల అవగాహనా కార్యక్రమాలను ప్రతీ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరపాలని చెప్పారు. ఈ ఆరు వారాల్లో డిజిటల్ అరెస్టులు, ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, ఓటీపీ, కేవైసీ ఫ్రాడ్లు, లోన్​ యాప్​‌ల వేధింపులు, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ సైబర్ క్రిమినల్స్​ చేస్తున్న నేరాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థల కోసం రూపొందించిన స్టూడెంట్​ ప్రోగ్రాం ఫర్​ అవేర్‌నెస్​ అండ్​ రెస్పాన్స్‌బుల్ సైబర్ స్పేస్‌ను ప్రారంభించారు. దీని ద్వారా ఆయా స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ఎస్​బీఐ సిబ్బందితో కలిసి సైబర్ డిఫెండర్స్​ అనే కార్యక్రమాన్ని కూడా డీజీపీ ఆరంభించారు.

Also ReadDGP Shivadhar Reddy: గ్లోబల్ సమ్మిట్‌కు భారీ బందోబస్తు.. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి : డీజీపీ శివధర్ రెడ్డి

29 శాతం పెరుగుదల

తెలంగాణ సైబర్​ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్​ శిఖా గోయల్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు 29 శాతం పెరిగాయన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో 8 శాతం తగ్గినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్​ నేరాల్లో బాధితులు పోగొట్టుకున్న డబ్బు 6 శాతం తగ్గితే రాష్ట్రంలో 30 శాతం తగ్గిందని వివరించారు. 1930 హెల్ప్​ లైన్​ అప్ గ్రేడ్​ చేయడంతోపాటు పుట్ ఆన్​ హోల్డ్​ వ్యవస్థను బలోపేతం చేయడం, ఆయా కేసుల్లో పకడ్బందీగా, వేగంగా విచారణ జరపడం వల్ల ఈ ఫలితాలను సాధించగలిగామన్నారు. హైకోర్టుతో కలిసి రూపొందించిన రీఫండ్​ ప్రాసెస్​ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడిన తరువాత 2.44 లక్షల ఎన్​సీఆర్పీ ఫిర్యాదులు అందినట్టు తెలిపారు. 58,244 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్టు చెప్పారు. బాధితులకు 350 కోట్ల రూపాయలకు పైగా రీఫండ్​ చేసినట్టు వివరించారు. సైబర్ నేరాలకు మరింత సమర్థవంతంగా కళ్లెం వేయడానికి రూపొందించిన ఫ్రాడ్​ కా ఫుల్ స్టాప్​ ప్రజలతో నేరుగా కలిసే భారీ ఉద్యమమని చెప్పారు. ఆరు వారాలపాటు ప్రతీ వారం ఒక ప్రత్యేక సైబర్​ మోసంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.

ఆరు వారాల్లో..

– మొదటి వారం సైబర్ సారథి @ 1930 – గోల్డెన్​ హవర్​ రిపోర్టింగ్​, 1930 హెల్ప్​ లైన్​‌పై అవగాహన
– రెండోవారం డిజిటల్ అరెస్ట్, సెక్సార్షన్​, సైబర్​ స్లేవరీపై ప్రచారం
– మూడో వారం పైసా పైలం పేర ఇన్వెస్ట్​‌మెంట్​ ఫ్రాడ్లు, లోన్ యాప్‌లు, ఫేక్ రివార్డులపై అవగాహన
– నాలుగో వారం హ్యాకింగ్​, రాన్‌సమ్​ వేర్​, ఫేక్​ యాప్‌లు, బెట్టింగ్​ యాప్‌లపై ప్రచారం
– ఐదో వారం మేరా లాగిన్ మేరా రూల్ పేర ఐడెంటిటీ థెఫ్ట్​, ఇంపర్సనైజేషన్​, ఓటీపీ, కేవైసీ మోసాలు ఎలా జరుగుతాయన్న దానిపై అవగాహన
– ఆరో వారం మహిళలు, పిల్లలకు సంబంధించి ఆన్​ లైన్​ ముప్పుల గురించి తెలియ చేస్తారు. దీని కోసం రాష్ట్రవ్యాప్తంగా వర్క్​ షాపులు, సెమినార్లు జరుపుతారు. స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన ఆర్యక్రమాలు నిర్వహిస్తారు. సైబర్ సేఫ్టీ వాక్స్​, ర్యాలీలు నిర్వహిస్తారు. పోస్టర్ పెయింటింగ్, షార్ట్ వీడియోల పోటీలు జరుపుతారు. సోషల్​ మీడియా ఛాలెంజ్​‌లతోపాటు లైవ్​ ఇంటరాక్షన్‌లు జరుపుతారు. జంక్షన్లు, మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ బస్టాండుల్లో జింగిల్స్ ప్రచారం చేస్తారు.

Also Read:DGP Shivadhar Reddy: నిర్లక్ష్యపు డ్రైవింగ్ తో.. ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడొద్దు : డీజీపీ శివధర్ రెడ్డి

Just In

01

Kids Mobile: చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి తెలుసా?

Indigo flight: సౌదీ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఎమర్జెన్సీగా అహ్మదాబాద్ మళ్లింపు

Loan Apps Ban: కేంద్రం మరో సంచలనం.. 87 లోన్ యాప్స్‌పై నిషేధం.. లోక్‌సభ వేదికగా ప్రకటన

Realme Smart Phone: రియల్‌మీ P4x 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసింది.. మరి, ఇంత చీపా?

Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..