CM Revanth Reddy( image credit: swetcha reporter
తెలంగాణ

CM Revanth Reddy: డిజిటల్ యుగంగా ప్రపంచం.. నైపుణ్యాల పెంపునకు స్కిల్ వర్సిటీ ఏర్పాటు!

CM Revanth Reddy: గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అయితే తమది ఇన్నోవేటివ్ ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth  Reddy)  స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో గూగుల్ కంపెనీ ఏర్పాటు చేసిన గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (జీఎస్ఈసీ)ను మంత్రి శ్రీధర్ బాబుతో (Sridar Babu) కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం (CM)  మాట్లాడుతూ, ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో గూగుల్ మొదటి సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. గూగుల్ (Google) ప్రారంభించినప్పటి నుంచి ప్రపంచం మారిపోయిందని చెప్పారు. నేడు మన జీవితాలు పూర్తిగా డిజిటల్‌గా మారాయన్నారు. ప్రపంచం మొత్తం డిజిటల్ యుగంగా మారుతుందని చెప్పారు.

గూగుల్ ఈ సైబర్ సెక్యూరిటీ హబ్‌

మనం గోప్యత, భద్రత గురించి నేడు ఆందోళన చెందుతున్నామని, మన ఆర్థిక వ్యవస్థ, మన ప్రభుత్వం, మన జీవితాలు డిజిటల్‌గా మారాయని వివరించారు. డిజిటల్ (Digital) సురక్షితంగా ఉంటే, మనం మరింత అభివృద్ధి చెందుతామన్నారు. అధునాతన సైబర్ సెక్యూరిటీ, భద్రతా పరిష్కారాల కోసం గూగుల్ (Google) ఈ సైబర్ సెక్యూరిటీ హబ్‌ను ఉపయోగిస్తున్నందుకు తాను గర్విస్తున్నానన్నారు. ఇది నైపుణ్య అభివృద్ధిపై దృష్టి పెడుతుందని, ఉపాధిని సృష్టించడంతో పాటు దేశం, సైబర్ భద్రతా సామర్థ్యాన్ని పెంచుతుందని తెలిపారు. చెడు చేయవద్దన్నది గూగుల్ (Google) సంస్థ సిద్ధాంతం, ఈ విధానాన్ని తాను ఇష్టపడుతున్నానని పేర్కొన్నారు.

 Also ReadLocal Body Election: లోకల్ బాడీ ఎన్నికల్లో.. పట్టు కోసం పార్టీలు తాపత్రయం!

గూగుల్ (Google) లాగా, నా ప్రభుత్వం కూడా మంచిని మాత్రమే చేస్తుందని నమ్ముతున్నానన్నారు. ఈ విధానం వల్ల ప్రయోజనాలు కొంత నెమ్మదిగా కనిపిస్తాయి, అయితే మనం దీర్ఘకాలికంగా దృష్టి పెట్టి పని చేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు ఉత్తమ పెట్టుబడి అనుకూల రాష్ట్రం కోసం శోధిస్తే దానికి సమాధానం తెలంగాణ (Telangana)  అని వస్తుందని తనకు కచ్చితంగా తెలుసు అని చెప్పారు. మీకు సెర్చ్‌లో మొదటి లింక్ హైదరాబాద్ (Hyderabad) వస్తుందన్నారు. దీనిని తాము  తెలంగాణ రైజింగ్ (Telangana Rising) అని పిలుస్తామని, 2035 నాటికి తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలనుకుంటున్నామని, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ (Telangana) మారాలన్నారు.

కోటిమంది మహిళా కోటీశ్వరులు

తాము కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనుకుంటున్నామని ఈ సందర్భగా సీఎం తెలిపారు. (Google)  గూగుల్ ఆఫీస్ పక్కనే రెండున్నర ఎకరాల్లో స్వయం సహాయక సంఘాల మహిళల కోసం స్టాల్స్ ఏర్పాటు చేశామన్నారు. తాము రైతులను సంపన్నులుగా తయారు చేయడంతో పాటు సంతోషంగా ఉంచాలనుకుంటున్నామని, యువతలో నైపుణ్యాలు పెంచడంతో పాటు వారికి ఉపాధి కల్పించాలనుకుంటున్నామని వివరించారు. వీటన్నింటి కోసం తనకు మీ మద్దతు అవసరం అని తెలిపారు.  (Telangana Rising) తెలంగాణ రైజింగ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా కావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. గూగుల్, హైదరాబాద్ (Hyderabad) పాత స్నేహితులు అన్నారు.

గూగుల్‌తో కలిసి పనిచేస్తున్నాం

2007లో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గూగుల్ (Google) తన మొదటి కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిందని, దాదాపు 7వేల మంది ఉద్యోగులు నేడు (Hyderabad) హైదరాబాద్‌ను తమ ఇల్లుగా భావిస్తున్నారన్నారు. విద్య, భద్రత, మ్యాప్‌లు, ట్రాఫిక్, స్టార్టప్‌లు, ఆరోగ్యం ఇలా అనేక రంగాలలో గూగుల్‌తో కలిసి తాము పనిచేస్తున్నామని స్పష్టం చేశారు. ‘‘నాణ్యమైన విద్య మా లక్ష్యం. ఇందుకోసం యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను తీసుకువస్తున్నాం. విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపు కోసం ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం.

పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంలో యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం. అందరికీ ఆరోగ్యం మా లక్ష్యం. ఇవే నా ప్రధాన ఆవిష్కరణలు. గూగుల్ (Google) లాగానే, నా ప్రభుత్వంలో భాగస్వాములైన మహిళలు, యువత, రైతులు, పేదలు, మధ్యతరగతి, సీనియర్ సిటిజన్లు, పిల్లలకు ఉన్నతమైన జీవన ప్రమాణాలు కల్పించాలని కోరుకుంటున్నా’’ అని, మనం కలిసి గొప్ప ప్రమాణాలను సృష్టిద్దామని పిలుపునిచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, తెలంగాణ (Telangana)ఎథికల్ ఇన్నోవేషన్”లో ఇతర రాష్ట్రాలకు టార్చ్ బేరర్‌గా దిశానిర్దేశం చేస్తుందన్నారు.

Also ReadLocal Elections: గ్రౌండ్ ప్రిపరేషన్‌లో అధికార కాంగ్రెస్.. జడ్పీ పీఠాలపై స్పెషల్ ఫోకస్!

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?