CM Revanth Reddy: హైదరాబాద్ బంగారానికీ హబ్‌గా మారుతుంది!
CM Revanth Reddy( IMAGE CREDIT: twitter)
Telangana News

CM Revanth Reddy: హైదరాబాద్ ఐటీకి మాత్రమే కాదు.. బంగారానికీ హబ్‌!

CM Revanth Reddy: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వం ఆయా కంపెనీలకు తగిన రీతిలో ప్రోత్సాహం ఇస్తుందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. ఆయన మలబార్ జెమ్స్ అండ్ జ్యువెలరీ తయారీ యూనిట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మాట్లాడుతూ, తెలంగాణలో (Hyderabad) హైదరాబాద్‌ను ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. మలబార్ తయారీ యూనిట్‌ను (Maheshwaram) మహేశ్వరంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నదన్నారు. హైదరాబాద్ (Hyderabad) ఐటీకే కాకుండా బంగారానికీ హబ్‌గా మారనున్నదన్నారు. (Telangana Rising) తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను డిసెంబర్ 9న ఆవిష్కరించబోతున్నామని తెలిపారు.

 Also ReadHC on Group 1: గ్రూప్-1 పిటిషన్లపై.. హైకోర్టులో విచారణ వాయిదా!

సీఎం అభినందన

రాబోయే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విజన్ డాక్యుమెంట్‌ను రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. మహేశ్వరంలో ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నామని వెల్లడించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పారిశ్రామిక పాలసీలను మార్చుకోలేదన్నారు. ఇండస్ట్రీయల్, ఇన్వెస్ట్‌మెంట్ పాలసీలు గత 30 ఏళ్లుగా స్థిరంగా ఉన్నాయని, వాటిని గతంలో మార్పులు చేసేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించకపోవడం దారుణమన్నారు. కానీ, తాము పెట్టుబడులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తూ ముందుకు వెళుతున్నామన్నారు. పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, వారికి లాభాలు చేకూరేలా రాష్ట్ర ప్రభుత్వం  (State Govt) సహకరిస్తుందన్నారు. తెలంగాణపై నమ్మకం ఉంచిన మలబార్ గ్రూప్‌కు సీఎం అభినందనలు తెలిపారు.

ఇక నుంచి బంగారం విక్రయాల్లోనూ
ఇప్పటికే ఐటీతో పాటు ఫార్మా, రియల్ ఎస్టేట్, బల్క్ డ్రగ్స్‌లో హైదరాబాద్ (Hyderabad) ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు. ఇక నుంచి బంగారం విక్రయాల్లోనూ హైదరాబాద్ (Hyderabad) ప్రత్యేకమైన మార్క్‌ను క్రియేట్ చేస్తుందన్నారు. కులీ కుదుబ్ షాహీలు హైదరాబాద్సి (Hyderabad) టీని నిర్మిస్తే, నిజాం నవాబులు హైదరాబాద్,  (Hyderabad)  సికింద్రాబాద్‌ను నిర్మించారని, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, (Chandrababu Naidu) రాజశేఖర్ రెడ్డి (Rajasekhar Reddy) సైబరాబాద్ మూడో సిటీని నిర్మించారని గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) నాలుగో భారత్ ప్యూచర్ సిటీని నిర్మించబోతున్నట్లు సీఎం వివరించారు. మహేశ్వరం (Maheshwaram) నియోజకవర్గం పరిధిలో 30 వేల ఎకరాలతో ప్రపంచంలోని అధునాతమైన నగరం

 Also Read: 3BHK Twitter Review: హీరో సిద్ధార్థ్ 3BHK ట్విట్టర్ రివ్యూ.. హిట్ కొట్టినెట్టేనా?

Just In

01

Boyapati Sreenu: నేనూ మనిషినే.. నాకూ ఫీలింగ్స్ ఉంటాయి

Bondi Beach Attack: బోండీ ఉగ్రదాడికి పాల్పడ్డ టెర్రరిస్టుల్లో ఒకరిది హైదరాబాద్.. సంచలన ప్రకటన

Mynampally Hanumanth Rao: కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ కోవర్టులు.. మైనంపల్లి సంచలన వ్యాఖ్యలు

Sivaji: నేను మంచోడినా? చెడ్డోడినా? అనేది ప్రేక్షకులే చెప్పాలి

Akhanda 2 OTT: ‘అఖండ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా? ఇంత త్వరగానా!