10 Class Student: హైకోర్టును ఆశ్రయించిన టెన్త్ విద్యార్థిని.. అసలేం జరిగిందంటే?
10 Class Student (imagecredit:twitter)
Telangana News

10 Class Student: హైకోర్టును ఆశ్రయించిన టెన్త్ విద్యార్థిని.. అసలేం జరిగిందంటే?

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: 10 Class Student: టెన్త్ పేపర్ లీక్​ కేసులో డీబార్ ​అయిన 1‌‌0వ తరగతి విద్యార్థిని హైకోర్టును ఆశ్రయించింది. తనను పరీక్షలకు అనుమతించేలా ఆదేశాలు జారీ చేయాలని అభ్యర్థిస్తూ పిటిషన్​ దాఖలు చేసింది. 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్​ కేసులో నకిరేకల్​ విద్యార్థిని ఝాన్సీ లక్ష్మీని బాధ్యురాలిగా పేర్కొంటూ విద్యా శాఖ అధికారులు ఆమెను డిబార్​ చేసిన విషయం తెలిసిందే.

కాగా, ఇందులో తన తప్పేమి లేదంటూ ఝాన్సీ లక్ష్మి గురువారం హైకోర్టులో లంచ్​మోషన్​ పిటిషన్ దాఖలు చేసింది. ఆకతాయి బండరాయితో కొడతానని బెదిరిస్తే ప్రశ్నాపత్రాన్ని చూపించినట్టుగా పేర్కొంది. పూర్తిగా విచారణ జరపకుండానే అధికారులు తనను డిబార్​ చేశారని తెలిపింది. తనను పరీక్షలకు అనుమతించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థించింది.

తన పిటిషన్​లో విద్యాశాఖ సెక్రటరీ, బోర్డ్​ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్​సెక్రటరీ, నల్గొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్​పరీక్షా కేంద్రం సూపరిండింటెంట్ లను ప్రతివాదులుగా పేర్కొంది. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఏప్రిల్ 7న కౌంటర్​ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి కేసును వాయిదా వేసింది.

Also Read: Bank of baroda Jobs 2025: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. అదిరిపోయే ఉద్యోగాలు.. వేలల్లో జీతం!

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?