Phone Tapping Case (magecredit:twitter)
తెలంగాణ

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్​కేసులో కీలక మలుపు.. ప్రశ్నలను సిద్ధం చేస్తున్న అధికారులు!

Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్​ కేసు కీలక మలుపు తిరిగింది. దీంట్లో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ప్రభాకర్​రావు స్వదేశానికి తిరిగి రానున్నారు. ఈనెల 5న విచారణకు హాజరవుతానని ఇప్పటికే ఆయన సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో దర్యాప్తు అధికారులు ఫోన్​ట్యాపింగ్ లో సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చటానికి ప్రభాకర్ రావుకు సంధించాల్సిన ప్రశ్నలను సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభాకర్​రావు నోరు తెరిస్తే ఈ వ్యవహారంలోని సూత్రధారులు ఎవరన్నది బయట పడుతుందని అధికారులు అంటున్నారు.

కాంగ్రెస్​ ప్రభుత్వం కొలువుదీరిన కొన్నాళ్లకే

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నడిచిన ఫోన్ ట్యాపింగ్​బాగోతం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే బయట పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు మొదటగా ఎస్​ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్​రావును అరెస్ట్ చేశారు. ఆ తరువాత అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలతోపాటు టాస్క్ ఫోర్స్ డీసీపీగా పని చేసిన రాధాకిషన్ రావును కూడా కటకటాల వెనక్కి పంపించారు. విచారణలో ఈ నలుగురు వెల్లడించిన వివరాలతో ఎస్​ఐబీ ఛీఫ్​గా పని చేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితునిగా చేర్చారు. ఓ ఛానల్​కు యజమానిగా ఉన్న శ్రవణ్​ రావును కూడా నిందితునిగా పేర్కొన్నారు.

అమెరికాకు పరార్

కాగా, కేసులు నమోదు కాగానే ప్రభాకర్​ రావు అమెరికాకు పారిపోయారు. విచారణకు రావాలని పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. దాంతో దర్యాప్తు అధికారులు పాస్ పోర్ట్​ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ప్రభాకర్ రావు పాస్ పోర్టును రద్దు చేయించారు. అదే సమయంలో సీబీఐ సహకారంతో ఇంటర్​ పోల్ ద్వారా ఆయనపై రెడ్​కార్నర్ నోటీస్​జారీ చేయించారు. మరోవైపు ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తునిగా గుర్తించాలంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు జూన్​20వ తేదీలోపు పరెండర్​కాని పక్షంలో ప్రభాకర్ రావును ప్రకటిత నేరస్తునిగా ప్రకటిస్తామంటూ ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన నోటీసులను పోలీసులు తారామతి బారాదరి ప్రాంతంలోని ప్రభాకర్ రావు ఇంటికి అంటించారు. ఇలా ఒత్తిడి పెరిగి పోతుండటంతో అరెస్ట్ నుంచి తప్పించుకోవటానికి ప్రభాకర్​ రావు తనను రాజకీయ శరణార్థిగా పరిగణించాలంటూ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకున్నారు. అయితే, ఈ అభ్యర్థనను అమెరికా ప్రభుత్వం తోసి పుచ్చింది. మరోవైపు రెడ్​కార్నర్ నోటీస్​జారీ అయిన నేపథ్యంలో అమెరికా హోం ల్యాండ్స్​ఏజన్సీ ప్రభాకర్​రావును భారత్ కు డిపోట్​చేయటానికి చర్యలకు శ్రీకారం చుట్టింది.

Also Read: MLC Kavitha: మనసులో బాధ కక్కేసిన కవిత.. బీజేపీ-బీఆర్ఎస్ పొత్తుపై షాకింగ్ కామెంట్స్!

అన్ని దారులు మూసుకుపోవటంతో

ఇలా అరెస్ట్​ నుంచి తప్పించుకునే అన్ని దారులు మూసుకుపోవటంతో విచారణకు సహకరించటానికి తాను సిద్ధంగా ఉన్నానని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ప్రభాకర్ రావు సుప్రీం కోర్టులో పిటిషన్​ వేశారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ప్రభాకర్​ రావు స్వదేశానికి వచ్చి విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఆయన ఇక్కడకు రావటానికి వీలుగా పాస్​ పోర్టును పునరుద్ధరించాలని పేర్కొంది. కానిపక్షంలో ట్రావెల్ పర్మిట్జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఆగస్టు 5వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ప్రభాకర్ రావుపై ఎలాంటి కఠిన చర్యలు (అరెస్ట్​ చేయవద్దని) తీసుకోరాదని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. అదే సమయంలో విచారణకు సహకరిస్తానంటూ కోర్టుకు అండర్​ టేకింగ్ లేఖను సమర్పించాలంటూ ప్రభాకర్​ రావుకు ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు అండర్​ టేకింగ్ లేఖను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇక, ఆయన భారత్ రావటానికి వీలుగా అమెరికాలోని భారత ఎంబసీ వర్గాలు ఎమర్జన్సీ ట్రావెల్​ పర్మిట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు స్వదేశానికి తిరిగి రావటం ఖాయమైంది. ఈనెల 5న విచారణకు హాజరవుతానని ప్రభాకర్​ రావు ఇప్పటికే సిట్​అధికారులకు తెలియచేసినట్టు సమాచారం.

ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్న సిట్

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రభాకర్ రావు విచారణకు రానున్న నేపథ్యంలో సిట్​అధికారులు ఆయనకు సంధించాల్సిన ప్రశ్నలతో ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది తేల్చే దిశగా ఇవి ఉండనున్నాయి. కాంగ్రెస్​తదితర పార్టీలకు చెందిన అగ్ర నాయకులు, వారి బంధుమిత్రులతోపాటు జడ్జిల ఫోన్లను ట్యాప్​చేయమని ఆదేశించిన అప్పటి బీఆర్​ఎస్ ప్రభుత్వ పెద్దలు ఎవరు? అన్న దానిపైనే ఎక్కువగా ఫోకస్​చేయనున్నారు.

Also Read: GHMC Employees: జీహెచ్ఎంసీ ఉద్యోగులకు .. అందని ద్రాక్షగా పదోన్నతులు!

Just In

01

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?