Magam Rangareddy Passes Away: బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి అకస్మాత్తుగా మృతి చెందారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు హుటాహుటీనా ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. దీంతో మాగం కుటుంబానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy), బీజేపీ నేత ఈటల రాజేందర్ (Etela Rajender) ప్రగాడ సానుభూతి తెలిపారు.
Also Read: Madhu Yashki Goud: జైలుకు వెళ్లనున్న కేసీఆర్, హరీష్.. మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు
మాగం రంగారెడ్డి రాజకీయ నేపథ్యానికి వస్తే.. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) సీఎం ఉన్న సమయంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ అశావాహుల నుంచి దరఖాస్తులు తీసుకునే బాధ్యతను పార్టీ అదిష్టానం మాగం రంగారెడ్డికి అప్పగించింది. ఇదిలా ఉంటే ఆయన మృతదేహాన్ని హైదరాబాద్ శామీర్ పేటలోని నివాసానికి తరలిస్తున్నారు.