KTDM-ACB
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

ACB: ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన వ్యవసాయాధికారి.. లంచం ఎంత అడిగాడంటే

ACB: ఏసీబీ వలకు చిక్కిన కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్
రూ.25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ నరసింహారావు

కొత్తగూడెం, స్వేచ్ఛ: ప్రభుత్వ అధికారులు రాష్ట్రంలో ఏదో ఒకచోట ఏసీబీ అధికారులకు పట్టుబడుతూనే ఉన్నారు. సోమవారం కొత్తగూడెం వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహారావు ఏసీబీ అధికారుల వలకు చిక్కారు. రూ.25 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. బంగారు చెలక గ్రామంలోని ఫర్టిలైజర్ షాపు యజమాని నుంచి రూ.25 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. యూరియా అమ్మకాల కోసం షోకాజ్ నోటీసులు ఇచ్చి ఆ నోటీసులను ఉపసంహరించుకునేందుకు లంచం డిమాండ్ చేశారు. దీంతో, బాధిత ఫెర్టిలైజర్ షాపు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రూ.25వేలు తీసుకుంటుండగా నరసింహారావును పట్టుకున్నారు. తన కార్యాలయంలో బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఖమ్మం ఏసీబీ డీఎస్‌పీ వై.రమేష్ వెల్లడించారు.

దడపుట్టిస్తున్న ఏసీబీ అధికారులు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాలతో పాటు సూర్యాపేట జిల్లాలో అవినీతి అధికారులకు ఏసీబీ (ACB officials) దడ పట్టుకుంది. ప్రభుత్వ ఉద్యోగాన్ని వెలగబెడుతూ, అక్రమంగా సొమ్ము చేసుకునేందుకు అవినీతికి పాల్పడుతున్న అధికారుల భరతం ఏసీబీ అధికారులు పడుతున్నారు. రాష్ట్రంలో నిత్యం ఏదో ఒకచోట అవినీతికి పాల్పడుతున్న అధికారులు ఏసీబీ వలకు చిక్కుతున్నారు. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతూ ఏసీబీ వలలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఊడిపోయి, జీవిత గమ్యాన్ని ఎలా ఒడ్డుకు చేర్చాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మగ్గుతున్నారు.

Read Also- Jubilee Hills Byelection: జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు షురూ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో దూకుడు
ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల డీఎస్పీలు సాంబయ్య, వై.రమేష్‌లు.. అవినీతి అధికారులపై దూకుడు ప్రదర్శిస్తున్నారు. అక్రమ ఆర్జన కోసం అర్రులు చాచి సామాన్య ప్రజల నుంచి దోచుకుంటున్న వారి భరతం పడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్ అధికారిణి తస్లీమా నస్రిన్‌పై అవినీతి ఆరోపణలు రావడం, ఆమెపై ఫిర్యాదులు అందాయి. ఓ బాధితుడి నుంచి డబ్బులు తీసుకుంటూ అటెండర్‌తో పాటు ఏసీబీ అధికారులకు తస్లీమా నస్రిన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయాయి. ఇదే రీతిలో మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి కారు డ్రైవర్, ముగ్గురు ఏజెంట్ల ద్వారా డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించిన గౌస్ పాషాను కూడా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

Read Also- Team India: సహనం కోల్పోయాడు.. టీమిండియా స్టార్ పేసర్‌పై పంజాబ్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

మరో ఘటనలో, అక్రమంగా బియ్యాన్ని వ్యాపారం చేస్తున్న ఓ వ్యాపారి నుంచి 2 లక్షల రూపాయల తీసుకుంటూ తొర్రూరు సీఐగా విధులు నిర్వహిస్తున్న అధికారి.. ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో ఓ సీఐ బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. అతడిని ఏసీబీ కోర్టుకు రిమాండ్ చేశారు. ఇక, సింగరేణి కార్యాలయంలో ఓ బాధితుడి వద్ద నుంచి డబ్బులు తీసుకుంటున్న అధికారిని సైతం ఏసీబీ అధికారులు వల వేసి పట్టుకున్నారు. గత మూడు రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్ సీఐ రాజేష్ కుమార్.. ఓ నల్ల బెల్లం వ్యాపారి నుంచి రూ.30 వేలు తీసుకొని ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?