will go to highcourt on changing emblem of telangana | Vinodh Kumar: హైకోర్టుకెళ్తా
brs vinodh kumar
Political News

Vinod Kumar: హైకోర్టుకు వెళ్తా!

– రాష్ట్ర చిహ్నాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీలు లేదు
– కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
– ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేస్తా
– స్పష్టం చేసిన మాజీ ఎంపీ వినోద్ కుమార్

Telangana Emblem: రాష్ట్ర చిహ్నంలో మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్. రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వ, హోంమంత్రిత్వ శాఖ అనుమతి తప్పనిసరి అవసరమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేసి నిర్ణయం తీసుకుంటుందని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో తాను సంవత్సరం పాటు తిరిగితే తమకు అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు.

చిహ్నాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీలు ఉండదని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ తీరును ప్రశ్నిస్తూ, తాను కోర్టులో కేసు వేస్తానని చెప్పారు. ఈ విషయం తెలిసే ప్రభుత్వం ఆలోచనలో పడిందని అన్నారు. కాకతీయ యూనివర్సిటీ పట్టభద్రుడిగా దీనిపై పోరాటం చేస్తానని తెలిపారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?