BJP party Meeting: బీజేపీ నేతలకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ క్లాస్ పీకారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని అవుషాపూర్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర స్థాయి కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సునీల్ బన్సల్ హాజరై మాట్లాడారు. పార్టీలో పక్షపాత ధోరణిని వదిలేయాలని సూచించారు. నేతలంతా కలిసి పనిచేయాలని, అందరిని భాగస్వాములను చేయాలన్నారు.
Also Read: Society for Social Auditl: సోషల్ ఆడిట్కు సహకరించని అధికారులు.. పంచాయతీ రాజ్ ససేమిరా!
మోదీ ద్వారా గ్రామాభివృద్ధి సాకారమైంది`
ఇప్పటి నుంచి నేతలంతా కొత్త ఫార్ములాతో ముందుకు వెళ్లాలన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఎలాంటి వ్యూహాలను అమలు చేయాలన్న దానిపై సమావేశంలో చర్చించామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని, కాంగ్రెస్ బుజ్జగింపు రాజకీయాలను, వారసత్వ రాజకీయాలను ప్రజలకు ఎత్తిచూపాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ద్వారా తెలంగాణలో గ్రామాభివృద్ధి సాకారమైందని ప్రజలకు తెలియజేయాలన్నారు.
Also Read: Pregnancy Yoga tips: గర్భిణి స్త్రీలు యోగా చేస్తే ఏమవుతుంది.. ఏ జాగ్రత్తలు పాటించాలి.. ఓ లుక్కేయండి!