Parigi MLA rammohan reddy
Politics

Hyderabad: కేసీఆర్ పగటి కలలు కంటున్నారు

పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి
Parigi MLA dr.Rammohan Reddy criticised kcr and party floor leaders:

మళ్లీ అధికారంలోకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పగటి కలలు కంటున్నాడని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి కోరితేనే ప్రభుత్వం విద్యుత్ మీద జ్యూడిషియల్ కమిషన్ వేసింది ఇప్పుడు చేసిన అవినీతి బయట పడుతుందని ఎల్. నర్సింహ రెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదన్నారు. కూతురు కవితని కాపాడుకోవడానికి బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నారన్నారు.ఏడు లక్షల కోట్లు అప్పలు చేసి వేలాది కోట్లు దుర్వినియోగం చేశారని అన్నారు. మాజీ మంత్రి హరీశ్ రావు మాటలు నమ్మొద్దు…ఆయన ఎప్పటికైనా బీజేపీలోకి పోతాడు అన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలన్నారు.

రుణమాఫీ పై సర్వత్రా ప్రశంసలు

లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి కేసీఆర్ వాయిదా పద్దతిలో చేశారు. తెలంగాణ సమాజం నీళ్లు, నిధులు, నీయామకాలు కావాలని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి గా గెలిపించారు. వచ్చిన అరు నెలల్లోనే రూ.2 లక్షల ఋణమాఫీ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అందరూ అభినందిస్తున్నారన్నారు.
అధికారంలోకి రాగానే 30 వేల ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. సొంత పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వలేదని విమర్శించారు డాక్టర్ రామ్మోహన్ రెడ్డి. జరగాల్సిన నష్టమంతా జరిగి..ఇప్పుడు ఫామ్ హౌస్ కు పిలిచి భోజనాలు పెడితే సరిపోదు..
తమ భవిష్యత్తు , నియోజకవర్గ అభివృద్ధి కోసమే బీఆర్ఎస్ మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్నారని అన్నారు.

Just In

01

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!