MP Mallu Ravi: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తో కలిసి BRS ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు . వచ్చే ఎన్నికల్లో బీజేపీ, BRS, టీడీపీ కలిసి తెలంగాణలో పోటీ చేయబోతున్నాయని ఎంపీ అన్నారు.
ముగ్గురు కలిసి ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ ప్రజా ప్రభుత్వమే వస్తుందని అన్నారు. కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నోటీసులకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టానికి అందరూ సమానమేనని.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చట్టానికి అతీతులా? ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళారు.
Also read: Hyderabad Rains: హైదరాబాద్లో భారీ వర్షం.. రోడ్లపైకి నీరు.. ప్రజలు ఇక్కట్లు!
బీహార్ లో లాలు ప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా? కేసీఆర్, హరీష్, ఈటెల కమిషన్ ముందు హాజరు కావాలి. నోటీసులు అందకపోవడం మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? విద్యుత్ కమిషన్ విషయంలో కేసిఆర్ తప్పు చేశారు. ఇప్పుడైనా కాళేశ్వరం కమిషన్ కు సహకరించాలని, ఎవరెన్ని కుట్రలు చేసినా .. అవినీతికి పాల్పడ్డవారు జైలుకెళ్లడం ఖాయం అని అన్నారు.