మహబూబాబాద్ స్వేచ్ఛ: MP Balram Naik: దేశ రాజదాని ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు హోరాహోరీగా జరుగుతున్నాయి. అటు ప్రతిపక్షం పాలక పక్షంనుంచి తమ వాదనలు వినిపిస్తున్నారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ మా ప్రాంతాని మా గిరిజన ఆదివాసీల విద్యార్థులకు మూడు నవోదయ విద్యాలయాలు ఇవ్వండని పార్లమెంట్ సమావేశాల్లో ఎంపీ పోరిక బలరాం నాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
పార్లమెంట్ జరిగిన జీరో అవర్ లో మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ పార్లమెంట్ సమస్యలపై మాట్లాడారు. తన నియోజకవర్గం లో గిరిజన, ఆదివాసీలతో పాటు ఏజెన్సీ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎక్కువగా ఉంటారని, వారు విద్యకు చాలా దూరంలో ఉంటారని ఆవేదన వ్యక్తంచేశారు.
మా ఆదివాసీలు అభివృద్ధి చెందాలంటే చదువుకోవడం అవసరం అని అన్నారు. అందుకు అనుగుణంగా మూడు కొత్త నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేసి గిరిజన, ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంత ప్రజలను చదువుకు దగ్గర చేసి వారు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని బలరాం నాయక్ కోరారు.
Also Read: Mahesh Kumar Goud: కేసీఆర్ వి పగటికలలే.. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఉండదు.. టీపీసీసీ చీఫ్ హాట్ కామెంట్స్