Kavitha: మన ముందున్న లక్ష్యం ఒక్కటే.. సామాజిక తెలంగాణను సాధించుకోవడమేనని ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత పాండురంగా రెడ్డి, బీఎస్పీ మల్కాజిగిరి ఇన్ చార్జి అందుగుల సత్యనారాయణ సహా పలువురు ఉద్యమకారులు జాగృతిలో చేరారు. వారికి జాగృతి కండువాలు కప్పి కవిత సాదరస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మనంతా ఆనాడు ఉద్యమంలో పనిచేశాం.. రాష్ట్రాన్ని సాధించిన విన్నింగ్ టీమ్ గా నిలిచామన్నారు.
Also Read: OG Movie: గంటకు ఎన్ని టికెట్స్ బుక్ అవుతున్నాయో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
ఆడబిడ్డలు అందరూ బాగుండాలి
తెచ్చుకున్న తెలంగాణలో ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు బాగుండాలన్నారు. యువతరం, ఆడబిడ్డలు అందరూ బాగుండాలన్నారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి కావాలని ఆలోచన చేస్తున్నామన్నారు. ఎంచుకున్న కొత్త లక్ష్యం కోసం పాత ఉద్యమకారుల పునరేకీకరణ జరుగుతోందన్నారు. పాత శక్తులందరం కలిసిన సందర్భంగా మన పవర్ ఏంటన్నది తెలంగాణ సమాజం గమనిస్తది అన్నారు. ఇలాంటి పునరేకీకరణతో సమాజానికి మంచి జరుగుతుందన్నారు. పాండురంగారెడ్డి ఉద్యమంలో కీలకంగా పనిచేశారన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఎగిసిపడేలా చేసిన వ్యక్తి అన్నారు. అలాంటి తను సామాజిక తెలంగాణ కోసం జాగృతిలో చేరడం సంతోషంగా ఉందన్నారు.
పేదల పక్షాన నిలవటమే జాగృతి ప్రధాన లక్ష్యం
ఇలాంటి శక్తులు మనకు ఒక్కో జిల్లాలో యాడ్ అవుతూ ఉన్నారన్నారు. వారందరినీ ఓపెన్ హార్ట్ తో వెల్ కమ్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఉద్యమకారులు కూడా ఉద్యమకారుల ఫోరమ్ పేరుతో పనిచేసేందుకు ముందుకు వస్తున్నారని, కళాకారులు కూడా తమ పోరాటానికి మద్దతివ్వాలని కోరారు. పేదల పక్షాన నిలవటమే జాగృతి ప్రధాన లక్ష్యం అని వెల్లడించారు. కుత్బుల్లాపూర్ లో హైడ్రా పేదల ఇళ్లు కూల్చితే మొదట వారికి మద్దతుగా నిలిచింది జాగృతియేనన్నారు. పేదల పక్షాన పనిచేసే శక్తిగా తెలంగాణ జాగృతి ఎదుగుతుందని వెల్లడించారు. జాగృతి లో చేరిన వారందరికీ సముచిత స్థానం కల్పిస్తామని స్పష్టం చేశారు.
Also Read: Delhi Baba: బాబా ముసుగులో రాసలీలలు.. 17 మందిపై లైంగిక దాడి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!