Ex Minister Jagadish Reddy slams power commission | KCR: విచారణ చేస్తూనే మీడియాతో మాటలా?
jagadish reddy
Political News

KCR: విచారణ చేస్తూనే మీడియాతో మాటలా?

– విద్యుత్ కొనుగోళ్లపై అనుమానాలొద్దు
– ఎక్కడా ప్రభుత్వానికి నష్టం జరగలేదు
– మాజీమంత్రి జగదీష్ రెడ్డి

Power Commission: విద్యుత్‌ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ జరగలేదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలంటూ ప్రభుత్వం విచారణ కమిషన్‌ వేసింది. అయితే.. నేటి ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు మేం ఆనాడే అసెంబ్లీలో సమాధానమిచ్చాం. శ్వేత పత్రామూ విడుదల చేశాం’ అన్నారు.

‘విచారణ చేయాలంటూ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌‌కు ఒక బాధ్యత అప్పగించింది. ప్రభుత్వ సందేహాలకు కేసీఆర్‌ ఇప్పటికే జవాబిచ్చారు. కానీ, కమిషన్‌ తీరు మాత్రం వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా ఉంది. జవాబిచ్చేందుకు నెలాఖరు వరకు కేసీఆర్ గడువు కోరినా ఇవ్వలేదు. అందుకే ఈ కమిషన్‌ బాధ్యతల నుంచి ఛైర్మన్‌ను తప్పుకోవాలని కేసీఆర్ సూచించారు. అందుకు తగిన ఆధారాలనూ తన లేఖలో ఆయన చూపారు’ అని పేర్కొన్నారు.

‘జస్టిస్‌ నరసింహారెడ్డి మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. ఒకవైపు విచారణ చేస్తూనే, తన అభిప్రాయాన్ని ముందుగానే మీడియాకు చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు కదా’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?