jagadish reddy
Politics

KCR: విచారణ చేస్తూనే మీడియాతో మాటలా?

– విద్యుత్ కొనుగోళ్లపై అనుమానాలొద్దు
– ఎక్కడా ప్రభుత్వానికి నష్టం జరగలేదు
– మాజీమంత్రి జగదీష్ రెడ్డి

Power Commission: విద్యుత్‌ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి నష్టమూ జరగలేదని, ఈ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం తెలంగాణభవన్‌‌లో మీడియాతో మాట్లాడుతూ.. ‘విద్యుత్‌ కొనుగోళ్లలో అవకతవకలంటూ ప్రభుత్వం విచారణ కమిషన్‌ వేసింది. అయితే.. నేటి ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలకు మేం ఆనాడే అసెంబ్లీలో సమాధానమిచ్చాం. శ్వేత పత్రామూ విడుదల చేశాం’ అన్నారు.

‘విచారణ చేయాలంటూ ప్రభుత్వం జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌‌కు ఒక బాధ్యత అప్పగించింది. ప్రభుత్వ సందేహాలకు కేసీఆర్‌ ఇప్పటికే జవాబిచ్చారు. కానీ, కమిషన్‌ తీరు మాత్రం వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా ఉంది. జవాబిచ్చేందుకు నెలాఖరు వరకు కేసీఆర్ గడువు కోరినా ఇవ్వలేదు. అందుకే ఈ కమిషన్‌ బాధ్యతల నుంచి ఛైర్మన్‌ను తప్పుకోవాలని కేసీఆర్ సూచించారు. అందుకు తగిన ఆధారాలనూ తన లేఖలో ఆయన చూపారు’ అని పేర్కొన్నారు.

‘జస్టిస్‌ నరసింహారెడ్డి మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్‌పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. ఒకవైపు విచారణ చేస్తూనే, తన అభిప్రాయాన్ని ముందుగానే మీడియాకు చెబుతున్నారు. ఇది పద్ధతి కాదు కదా’ అని జగదీష్‌రెడ్డి చెప్పారు.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్