EC issues notice to cm jagan సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
CM Jagan
Political News

EC: సీఎం జగన్‌కు ఎన్నికల సంఘం నోటీసులు

CM Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఎన్నికల సంఘం ఈసీ నోటీసులు పంపింది. జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్రలో ప్రసంగిస్తూ ప్రతిపక్షాలపై విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మోసగాడు అంటూ, ఎన్నికల సంఘం వర్ల రామయ్య ఫిర్యాదు పరిశీలించి యాక్షన్ తీసుకుంది. సీఎం జగన్‌కు నోటీసులు పంపింది.

జగన్ తన బస్సు యాత్రలో మాట్లాడుతూ చంద్రబాబుపై, ఆయన గత పాలనపై, టీడీపీ మ్యానిఫెస్టోపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఆరు అంశాలను తరుచూ పేర్కొంటూ చంద్రబాబుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ ప్రసంగాలకు సంబంధించిన వీడియోను కూడా సమర్పించారు.

Also Read: ‘ఓటు ఎవరికైనా వేయండి.. కానీ వేయండి’

ఈ ఎన్నికలు జగన్‌కు చంద్రబాబుకు కాదని, ప్రజలకు – పెత్తందారులకు అని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. టీడీపీ చేసిన ఫిర్యాదు వల్లే పింఛన్ ఆగిపోయందని, తద్వార 31 మంది పింఛన్ లబ్దిదారులు మరణించారని, ఈ మరణాలకు చంద్రబాబు నాయుడే బాధ్యుడని జగన్ ఆరోపించారు. అలాగే.. టీడీపీ మ్యానిఫెస్టోను చూపిస్తూ ఆ హామీలను విమర్శించారు. గతంలో టీడీపీ ఇచ్చిన హామీలను అమలు చేసిన దాఖలాలు లేవని ఆరోపించారు.

సీఎం జగన్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించిన ఎన్నికల సంఘం యాక్షన్ తీసుకుంది. ఈ వ్యాఖ్యలను సీఎం జగన్‌కు ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాలని నోటీసులు పంపింది. 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. న్యాయనిపుణులను సంప్రదించి వివరణ ఇస్తామని వైసీపీ వర్గాలు తెలిపాయి.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?