Telugu movies records: తెలుగు సినిమా కేవలం కథలకే కాదు, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించడంలో కూడా దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. ప్రతి ఏడాది కొత్త రికార్డులు సృష్టిస్తూ, తెలుగు సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో కూడా తమ సత్తాను చాటుతున్నాయి. ఈ ప్రస్థానంలో, కొన్ని సినిమాలు వందల కోట్ల వసూళ్లను దాటి, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయి.
అలాంటి చిత్రాలు తెలుగు తెలుగు నుంచి ఎక్కువగా వస్తుంటాయి.
Read also-comedians turned heroes: టాలీవుడ్లోకి కమెడియన్లుగా వచ్చి హీరోలైన నటులు వీరే..
‘బాహుబలి’ ప్రభంజనం
తెలుగు సినిమా స్థాయిని, ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత ఎస్.ఎస్.రాజమౌళి దక్కుతుంది. ఆయన దర్శకత్వం వహించిన ‘బాహుబలి’ సిరీస్ లు ప్రపంచ ప్రఖ్యాతి కాంచాయి. అందులో ఒకటి బాహుబలి 2: ది కన్క్లూజన్ (2017). ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1800 కోట్లకు పైగా (సుమారు) వసూలు చేసి, భారతీయ చలనచిత్ర చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఇది తెలుగు సినిమాకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ సిరీస్లో మొదటి భాగం కూడా దాదాపు రూ. 600 కోట్లకు పైగా వసూళ్లతో అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ రెండు సినిమాలు కేవలం తెలుగులోనే కాక, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ ఘన విజయం సాధించి, పాన్-ఇండియా చిత్రాల ట్రెండ్కు నాంది పలికాయి.
‘బాహుబలి’, తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం పుష్ప 2: ది రూల్ (2024). అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఈ చిత్రం రూ. 1600 కోట్లకు పైగా వసూలు చేసి, రాజమౌళి సినిమాల తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది (తాజా అంచనాల ప్రకారం). ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చాట్ బాస్టర్లుగా నిలిచాయి. దర్శకధీరుడు రాజమౌళి నుంచి వచ్చిన మరో అద్భుత దృశ్యకావ్యం RRR (2022). చారిత్రక కల్పిత కథాంశంతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా రూ. 1200 కోట్ల నుంచి రూ. 1300 కోట్ల వరకు వసూలు చేసి, బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు దక్కడం తెలుగు సినిమా స్థాయిని పతాక స్థాయికి చేర్చింది.
Read also-Mithramandali OTT: ఓటీటీలో దూసుకుపోతున్న ‘మిత్రమండలి’.. కారణం అదేనా..
అంతే కాకంగా.. కల్కి 2898 AD (2024) ప్రభాస్ హీరోగా నటించిన ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రం కూడా రూ. 1000 కోట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా ఘనతను పెంచింది. ప్రభాస్ హీరోగా వచ్చిన మరో చిత్రం సలార్: పార్ట్ 1 – సీజ్ఫైర్ (2023): ప్రభాస్ నటించిన ఈ చిత్రం రూ. 600 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మధ్య వసూలు చేసి, టాప్ గ్రాసర్స్ లిస్ట్లో చేరింది. సాహో (2019), అల వైకుంఠపురములో (2020), సైరా నరసింహారెడ్డి (2019) వంటి సినిమాలు కూడా రూ. 200 కోట్ల నుండి రూ. 400 కోట్ల మధ్య వసూళ్లను సాధించి, తెలుగు చిత్ర పరిశ్రమ వాణిజ్య బలాన్ని నిరూపించాయి. ఈ సినిమాలు కేవలం బాక్సాఫీస్ గణాంకాలే కాక, తెలుగు చిత్రాల కథా వైవిధ్యాన్ని, సాంకేతిక విలువలను, హీరోల స్టార్డమ్ను కూడా ప్రతిబింబిస్తాయి. తెలుగు సినిమా భవిష్యత్తులో మరిన్ని భారీ వసూళ్ల రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
