Avatar Fire and Ash: అవతార్ సినిమా అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే ఈ సిరీస్ ల నుంచి వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బాస్టర్లుగా నిలిచాయి. జేమ్స్ కామెరూన్ రూపొందించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ప్రపంచవ్యాప్తంగా అసాధారణమైన అంచనాలను సృష్టిస్తోంది. ముఖ్యంగా భారతదేశంలో ఈ సినిమాపై క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుండగా, అడ్వాన్స్ బుకింగ్స్, ఆన్లైన్ ట్రెండ్స్, ప్రేక్షకుల స్పందన ఈ చిత్రాన్ని అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్గా నిలబెడుతున్నాయి. ఇప్పటికే ఎస్.ఎస్. రాజమౌళి ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ జేమ్స్ కామెరూన్తో ప్రత్యేక చర్చ జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ కూడా ఈ చిత్రంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Read also-Ravi Teja: రవితేజ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
సినిమా చూసిన అనంతరం సుకుమార్ మాట్లాడుతూ… ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఒక అబ్సల్యూట్ బ్లాక్బస్టర్ అని పేర్కొన్నారు. గ్రాండ్ విజువల్స్ మాత్రమే కాకుండా, కథలో నిండి ఉన్న బలమైన భావోద్వేగాలు ప్రేక్షకులను లోతుగా తాకుతాయని అన్నారు. ఎపిక్ స్కేల్లో కథను చెప్పడంలో జేమ్స్ కామెరూన్ మరోసారి తన సిగ్నేచర్ స్టైల్ను చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రం కేవలం ఒక సినిమా కాదని, ఇది నిజమైన ఈవెంట్ ఫిల్మ్ అని, కుటుంబ సమేతంగా థియేటర్లో చూసినప్పుడే పూర్తి అనుభూతి లభిస్తుందని సుకుమార్ స్పష్టం చేశారు.
కథా నేపథ్యం
మునుపటి రెండు భాగాల్లో మనం పండోరా గ్రహంపై ఉన్న అడవులను, సముద్రాలను చూశాం. అయితే, ‘ఫైర్ అండ్ యాష్’లో కామెరూన్ మనకు ‘యాష్ పీపుల్’ (Ash People) అనే కొత్త తెగను పరిచయం చేయబోతున్నారు. వీరు అగ్నిపర్వత ప్రాంతాలలో నివసించే వారు. ఇప్పటివరకు మనం చూసిన నావీ తెగలు శాంతిని కోరుకునేవిగా ఉంటే, ఈ కొత్త తెగ కోపం, ద్వేషం, హింసాత్మక ప్రవృత్తిని కలిగి ఉంటుందని సమాచారం.
సాంకేతికత
జేమ్స్ కామెరూన్ అంటేనే విజువల్ వండర్. ఈ సినిమా కోసం ఆయన అత్యున్నత స్థాయి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఉపయోగించారు. పండోరాలోని అగ్నిపర్వతాలు, బూడిదతో నిండిన వాతావరణాన్ని వెండితెరపై అద్భుతంగా చూపించబోతున్నారు. జేక్ సల్లీ (సామ్ వర్తింగ్టన్), నెయితిరి (జో సల్దానా) పాత్రలు ఈసారి మరింత క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కోనున్నాయి. ఈ సినిమా 2025 డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అవతార్ 3’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అగ్ని బూడిద మధ్య జరిగే ఒక భావోద్వేగ పోరాటం. పండోరా గ్రహంపై ఉండే చీకటి కోణాన్ని ఈ సినిమా ఆవిష్కరించబోతోంది. 20th సెంచరీ స్టూడియోస్ సమర్పిస్తున్న ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ చిత్రం డిసెంబర్ 19న భారతదేశంలో ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

