Mandhana Wedding: కుటుంబ గోప్యత కోరిన పలక్ ముచ్చల్..
palash-muchal(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Mandhana Wedding: స్మృతి మంధాన కుటుంబ గోప్యతను గౌరవించాల్సినదిగా మీడియాను కోరిన పలక్ ముచ్చల్..

Mandhana Wedding: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ప్లేయర్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ ఊహించని పరిణామం నేపథ్యంలో, పలాష్ సోదరి, ప్రముఖ గాయని పలక్ ముచ్చల్ తమ కుటుంబ గోప్యతను గౌరవించాల్సిందిగా మీడియాను, ప్రజలను అభ్యర్థించారు. నిజానికి, పలాష్-స్మృతిల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉంది. అయితే, వధువు తండ్రి, శ్రీనివాస్ మంధాన అనారోగ్యం కారణంగా ఈ పెళ్లి వేడుకలను నిలిపివేశారు. వివాహ రోజునే శ్రీనివాస్ మంధానకు గుండెపోటు వంటి లక్షణాలు కనిపించడంతో, వెంటనే ఆయనను సాంగ్లీలోని సర్వహిత్ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ సెంటర్‌కు తరలించారు. ఈ అత్యవసర పరిస్థితి కారణంగా, ముచ్చల్, మంధాన కుటుంబాలు వివాహ కార్యక్రమాలను తాత్కాలికంగా ఆపేశాయి.

Read also-Puri Sethupathi: పూరీ సినిమాలో చివరిరోజు షూట్ తర్వాత ఎమోషనల్ అయిన విజయ్ సేతుపతి.. ఎందుకంటే?

పలక్ ముచ్చల్ ప్రకటన..

ఈ సున్నితమైన సమయంలో కుటుంబ పరిస్థితిని వివరిస్తూ పలక్ ముచ్చల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక సందేశాన్ని పంచుకున్నారు. “స్మృతి తండ్రి ఆరోగ్యం కారణంగా, స్మృతి, పలాష్‌ల వివాహం తాత్కాలికంగా నిలిపివేయబడింది. ఈ సున్నితమైన సమయంలో, దయచేసి కుటుంబాల గోప్యతను గౌరవించాల్సిందిగా మేమందరం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము.” పెళ్లి వేడుకలకు ముందు జరిగిన మెహందీ కార్యక్రమం నుండి వధూవరులతో కలిసి దిగిన ఒక మధురమైన ఫోటోను కూడా పలక్ ఈ సందర్భంగా పంచుకున్నారు.

పెళ్లి కొడుక్కి అనారోగ్యం..

శ్రీనివాస్ మంధాన ఆసుపత్రిలో చేరిన మరుసటి రోజు, వరుడు పలాష్ ముచ్చల్ కూడా తీవ్ర అనారోగ్యంతో సాంగ్లీలోని ఒక ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై పలాష్ తల్లి మీడియా తో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పలాష్‌కు స్మృతి తండ్రితో చాలా ఆత్మీయ అనుబంధం ఉందని, ఆయన అనారోగ్యం కారణంగా పలాష్ తీవ్ర ఒత్తిడికి లోనై, చాలా ఏడ్చాడని తెలిపారు. ఈ ఆందోళనతోనే అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆసుపత్రిలో పలాష్‌కు సుమారు నాలుగు గంటల పాటు చికిత్స అందించి, ఐవీ డ్రిప్, ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు. పరీక్షలన్నీ సాధారణంగా ఉన్నప్పటికీ, అతను తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం పలాష్ ముంబైకి తిరిగి వచ్చి ఇంట్లోనే కోలుకుంటున్నాడు. ఈ సంఘటనల నేపథ్యంలో వధూవరులిద్దరూ ఒత్తిడికి లోనవుతున్నారని ఆయన తల్లి పేర్కొన్నారు.

Read also-Rakul Preet Singh: మొన్న శ్రియా, నేడు రకుల్.. దయచేసి వెంటనే బ్లాక్ చేయండి!

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ 2019లో డేటింగ్ ప్రారంభించారు. చాలా కాలం పాటు ఈ బంధాన్ని గోప్యంగా ఉంచిన ఈ జంట, ఐదేళ్లు పూర్తైన సందర్భంగా 2024 జూలైలో తమ సంబంధాన్ని బహిరంగపరిచారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో స్మృతికి పలాష్ ప్రపోజ్ చేసిన వీడియో కూడా గతంలో వైరల్ అయ్యింది. ఈ కష్ట సమయంలో రెండు కుటుంబాలు త్వరగా ఒత్తిడి నుండి బయటపడి, ఆరోగ్యకరమైన వాతావరణంలో తదుపరి వివాహ వేడుకలను నిర్వహించాలని అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?