Samantha: సమంత, నాగ చైతన్య కలిసి జంటగా నటించిన సినిమా ” ఏం మాయ చేసావే “. ఈ మూవీ నుంచే వీరిద్దరూ స్నేహితులు అయ్యారు. అలా స్నేహ బంధం ప్రేమగా మారి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే, నాలుగేళ్ళు కూడా కలిసి ఉండలేకపోయారు. వీళ్ళు విడిపోయిన తర్వాత ఎన్నో ప్రశ్నలు? ఇప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు విడిపోయారో సరైన కారణం ఇంత వరకు బయటకు రాలేదు. అయితే, వీరిద్దరూ ఎందుకు విడిపోయారో ఇండస్ట్రీలో కొందరికి తెలుసని అంటున్నారు. అయితే, ఎవ్వరూ ఊహించని విధంగా ఈ జంట విడిపోయి అందరికీ బిగ్ షాక్ ఇచ్చారు. అయితే, తాజాగా సామ్ గురించి ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Also Read: Medical Students Drugs: మెడికోస్ గంజాయి మత్తులో.. కోటిన్నర టర్నోవర్ కలిగిన మహిళా పెడ్లర్ అరెస్ట్
సమంత, నాగచైతన్య జంటకు తెలుగు సినీ అభిమానుల్లో ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ జంట జీవితాంతం కలిసి సంతోషంగా ఉండాలని కోరుకునే అభిమానులు చాలామంది ఉన్నారు. అయితే, వీరి వైవాహిక జీవితంలో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
సమంత అందుకే విడాకులు ఇచ్చిందా?
విడాకుల తీసుకున్న తర్వాత నాగచైతన్య శోభితని పెళ్లి చేసుకుని తన కొత్త జీవితాన్ని ప్రారంభించగా, సమంత కూడా త్వరలోనే కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నట్టు తెలిసిన సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల ప్రముఖ సైకాలజిస్ట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, సమంత ఏడుపు అంతా ఒక నాటకమేనని, నాగచైతన్యను బెదిరించి పెళ్లి చేసుకుందని దారుణమైన ఆరోపణలు చేశారు. విడాకుల తర్వాత సమంత చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఆమె ఫ్యాన్స్, జనాలు పిచ్చోళ్లు అయ్యారు. సానుభూతి కోసం దొంగ కన్నీళ్లు కార్చిందని, ఈవెంట్లలో ప్రజల సానుభూతి పొందేందుకు నటించిందని అతను విమర్శించారు.
Also Read: Baba Vanga: వినాశనం తప్పదా.. త్వరలో భూమ్మీదకు ఏలియన్స్.. బయటకొచ్చిన వణుకుపుట్టించే నిజాలు?
“సమంతకు ఎమోషనల్ మెచ్యూరిటీ లేదు. సమంత కంటే నాగచైతన్య నే చాలా బెటర్. విడాకుల తర్వాత చైతన్య చాలా బాధపడి ఉంటారు. కానీ, సమంత మొదట అతన్ని బెదిరించి పెళ్లి చేసుకుని, ఆ తర్వాత విడాకులు తీసుకుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. సమంత అభిమానులు నన్ను తిట్టినా పర్లేదు నేను నిజాలే చెప్పాను ” అంటూ షాకింగ్ వకామెంట్స్ చేశారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు సమంత-చైతన్య అభిమానుల్లో చర్చనీయాంశంగా మారాయి. సమంత గురించి ఇలాంటి ఆరోపణలు చేసిన ఈ సైకాలజిస్ట్ వ్యాఖ్యలపై మీరు ఏమనుకుంటున్నారు?