Pawan Kalyan
ఆంధ్రప్రదేశ్, ఎంటర్‌టైన్మెంట్

Pawan Kalyan | స్వామిమలై ఆలయాన్ని సందర్శించిన పవన్ కల్యాణ్​..!

Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్​ ఆలయాల సందర్శన కొనసాగుతోంది. బుధవారం ఆయన సనాతన ధర్మ పరిరక్షణ యాత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా కేరళకు వెళ్లిన ఆయన.. అక్కడ పలు ఆలయాలను సందర్శించారు. ఆ తర్వాత గురువారం తమిళనాడులోని తంజావూరు జిల్లా కుంభకోణం సమీపంలోని స్వామిమలై ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ కుమారస్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నారు.

తమిళనాడులోని ఇంకా కొన్ని ప్రముఖ ఆలయాలను ఆయన సందర్శిస్తారని తెలుస్తోంది. ఇక తమిళనాడు రాజకీయాలపై కూడా ఏమైనా కామెంట్ చేస్తారేమో అని అంతా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు పవన్ (Pawan Kalyan) అయితే ఎలాంటి కామెంట్లు చేయట్లేదు. కానీ హిందూ ఆలయాల పరిరక్షణపై మాట్లాడుతూ వస్తున్నారు. తమిళనాడులోని బీజేపీ ముఖ్య నేతలను కలుస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు.

Just In

01

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?