Eesha Movie: యువ ప్రేక్షకులను ఉద్దేశించి సరికొత్త కథాంశాలతో రూపొందే చిత్రాలు ఎప్పుడూ సినీ పరిశ్రమలో ఉత్సాహాన్ని నింపుతాయి. అలాంటి ఉత్సాహాన్ని పెంచే చిత్రాలలో ఒకటిగా ‘ఈషా’ సినిమా నిలుస్తోంది. డిసెంబర్ 12,2025న విడుదల కావాల్సిన ఈ సినిమా అఖండ 2 సినిమా విడుదల వల్ల డిసెంబర్ 25కు వాయిదా పడింది. పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ‘ఈషా’ చిత్రానికి ప్రముఖ నిర్మాత కే.ఎల్. దామోదర ప్రసాద్ సమర్పణ ఉండటం విశేషం. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఆయన మద్దతు ఈ సినిమాకు మరింత బలాన్ని ఇచ్చింది. ఈ చిత్రాన్ని హెచ్వీఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై ఆపారమైన అభిరుచితో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. అగ్ర నిర్మాతల పర్యవేక్షణ, యువ నిర్మాత పట్టుదల కలగలిసి ఈ ప్రాజెక్ట్ను మరింత ఉన్నత స్థాయిలో నిలబెట్టాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి టికెట్ రేట్లు అందుబాటులోనే ఉంటాయని నిర్మాతలు తెలిపారు. రాజు వెడ్స్ రాంబాయి సినిమా తరహాలో ఈ సినిమాకు కూడా రూ.99 రూపాయల టికెట్ ఉంటుందని తెలిపారు.
Read also-Bigg Boss9 Telugu: ఆ పోరు నుంచి సుమన్ శెట్టి అవుట్.. సపోర్ట్ చేసింది ఎవరికంటే?
ఈ హారర్ థ్రిల్లర్ కథను శక్తిమంతంగా తెరకెక్కించే బాధ్యతను దర్శకుడు శ్రీనివాస్ మన్నె తీసుకున్నారు. హారర్ జానర్లో కొత్త ట్రెండ్ను సెట్ చేసే విధంగా ఆయన ఈ కథనాన్ని మలిచారని తెలుస్తోంది. సన్నివేశాల ఎంపిక, భయానక వాతావరణాన్ని సృష్టించడంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. ‘ఈషా’ చిత్రంలో ప్రతిభావంతులైన యువ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. త్రిగుణ్, అఖిల్రాజ్ కీలకమైన పాత్రలు పోషించగా, వారికి జోడీగా, కమర్షియల్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న హెబ్బా పటేల్, యువతలో మంచి ఫాలోయింగ్ ఉన్న సిరి హనుమంతు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నలుగురు నటీనటుల మధ్య ఉండే కెమిస్ట్రీ, భయానకమైన కథాంశంలో వారు తమ పాత్రలకు న్యాయం చేసిన తీరు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Read also-Ram Setbacks: రామ్ పోతినేని ‘ఆంధ్రకింగ్ తాలూకా’ క్లోజింగ్ రిపోర్ట్.. ఆ రికార్డుల్లోకి మరో సినిమా..
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. చిత్రానికి సంబంధించిన టీజర్ను డిసెంబర్ 5న విడుదల చేయగా, దీనికి సినీ అభిమానుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. అనంతరం, కథలోని లోతును, ఉత్కంఠను పెంచే ట్రైలర్ను డిసెంబర్ 9న విడుదల చేశారు. ఈ ప్రచార సామగ్రి సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ ఉత్కంఠభరితమైన హారర్ థ్రిల్లర్ను డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ‘ఈషా’ థియేట్రికల్ రిలీజ్ను ప్రతిష్టాత్మకంగా భావించి వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్ బ్యానర్లపై వంశీ నందిపాటి, ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ విడుదల చేస్తున్నారు. అగ్ర నిర్మాత బన్నీ వాస్ ఈ సినిమా పంపిణీలో భాగం కావడం, ‘ఈషా’ స్థాయిని, విజయావకాశాలను రెట్టింపు చేసింది. మొత్తం మీద, యువతరం ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉన్న ‘ఈషా’ చిత్రం, 2025లో హారర్ థ్రిల్లర్ జానర్లో ఒక మైలురాయిగా నిలిచేందుకు సిద్ధంగా ఉంది.

