Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ ఇండస్ట్రీ ఉన్నంత కాలం చిరు పేరు వినబడుతూనే ఉంటుంది. ఎవరి సపోర్ట్ లేకుండా గొప్ప స్థాయికి ఎదిగి, ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. చిరు నుంచి సినిమా వస్తుందంటే చాలు.. ఫ్యాన్స్ బ్యానర్స్ పెట్టి హడావుడి చేస్తుంటారు. ఇప్పటికీ మొత్తం 150 కి పైగా సినిమాల్లో నటించి ఎన్నో హిట్స్ కొట్టాడు. అయితే, హిట్స్ & ఫ్లాప్స్ తో సంబందం లేకుండా మెగా ఫ్యాన్స్ కోసం సినిమాలు చేస్తుంటాడు.
Also Read: Janulyri : జాను లిరీతో బ్రేకప్ అయ్యాక 24 గంటలు అలా చేసే వాడ్ని.. చనిపోదామనుకున్నా.. డాన్సర్ టోనీ
అయితే, చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రీ రిలీజ్ సందర్భంగా స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఈ చిత్రం రీసెంట్ గా మళ్లీ రీ రిలీజ్ చేసిన విషయం మనకీ తెలిసిందే. అయితే, ఈ మూవీకి ఇచ్చిన ప్రమోషన్స్ లో డైరెక్టర్ రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీ దత్, హీరో చిరంజీవి ముగ్గురు కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. చిరంజీవి ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.
Also Read: HPCL Recruitment 2025: హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్లో ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ” జగదేకవీరుడు అతిలోకసుందరి మూవీ ఘాట్ చేస్తున్న సమయంలో శ్రీదేవి నా కోసం ఒక ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ చెస్ బోర్డుని ఇచ్చింది. దీనిని ఇంగ్లాండ్ నుండి తెప్పించింది. అది ఇప్పటికీ మా ఇంట్లో ఉంది. అయితే, ఇది మాన్యువల్ గా ఉంటుంది. అదే ఆడుతుంది. మనం కూడా దీనితో ఆడొచ్చు. అయితే, షూటింగ్ గ్యాప్ లో ఇద్దరం కలిసి ఆడేవాళ్ళం. మేము సీరియస్ గా ఆడుతున్న సమయంల అమ్రిష్ పూరి వచ్చి మా ఆట డిస్టర్బ్ చేసే వాళ్ళు ” అంటూ చిరంజీవి శ్రీదేవిని గుర్తు చేసుకుంటూ చెప్పారు.