Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. హీరో నాగ చైతన్య తో విడాకులు తీసుకుని ప్రస్తుతం సామ్ సింగిల్ గా ఉంటుంది. కానీ, చైతూ మాత్రం శోభిత ధూళిపాళ్ళను రెండో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నాడు. అయితే, ప్రస్తుతం సమంత సినిమాలు చేయకుండా నిర్మాతగా బాధ్యతలు తీసుకొని శుభం చిత్రంతో మన ముందకొచ్చింది. అల్మోస్ట్ సక్సెస్ అయినట్టే తెలుస్తోంది. శుభం మూవీ మంచి కలెక్షన్స్ వసూలు చేయడంతో ఆమె సంతోషంగా ఉంది. ఈ మూవీ అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకోవడంతో మూవీ టీం కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఫుల్ బిజీ అయ్యారు. అయితే, తాజాగా సమంత కి సంబందించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read: Preity Zinta: ఆ క్రికెటర్ ను పెళ్లి చేసుకో అన్న ప్రశ్నకి.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ప్రీతి జింతా
సమంత నిర్మించిన ” శుభం ” మూవీ హిట్ అవ్వడంతో ఆ హ్యాపీనెస్ ను అభిమానులతో పంచుకుంటుంది. ఈ క్రమంలోనే డైరెక్టర్ రాజ్ నిడిమోరు తో దిగిన ఫోటోలను కూడా షేర్ చేసింది. గత కొంత కాలం నుంచి వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అంతే కాదు, ఇతనితో కలిసి తిరగడం, బయటకు వెళ్ళడం లాంటివి చూస్తుంటే వీరి ప్రేమ నిజమే అని అనిపిస్తోంది. ఇంత వరకు ఒక్కరూ కూడా స్పందించలేదంటే రెండో పెళ్లి కూడా నిజమే అన్న వార్తలకు బలం చేకూరింది. అయితే, ఇదిలా ఉండగా డైరెక్టర్ భార్య పెట్టిన పోస్ట్ సంచలనంగా మారింది.
Also Read: Samantha: దాని వలనే నా లైఫ్ నాశనమైంది.. చచ్చిపోదామనుకున్నా.. సమంత సంచలన కామెంట్స్
డైరెక్టర్ భార్య శ్యామల ” నా కోసం ఆలోచించే వారు, వినే వారు , వినిపించే వారు, మాట్లాడేవారు, మాట్లాడించే వారు, రాసే వారిని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా. నా ఆశీర్వాదాలు పంపుతూనే ఉంటా ” అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.