Monday, July 1, 2024

Exclusive

Telangana:‘అప్పు’డే ఆ పని చేయొద్దు?

  • కొత్తగా అప్పులు చేయొద్దని రాష్ట్ర ఆర్థిక శాఖకు రేవంత్ ఆదేశం
  • బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కు చుట్టుకుంటున్న తిప్పలు
  • నాటి సర్కార్ చేసిన అప్పులకు నెలనెలా వడ్డీలు కడుతున్న కాంగ్రెస్
  • రోజుకు రూ.207 కోట్ల వడ్డీ కడుతున్న రేవంత్ సర్కార్
  • నెలకు రూ.6 వేల కోట్లుకు పైగానే ఉన్న కట్టవలసిన వడ్డీలు
  • మరో పక్క రైతు రుణమాఫీపై ముంచుకొస్తున్న గడువు
  • రేవంత్ సర్కార్ ను ఊపిరి సలపకుండా చేస్తున్న బీఆర్ఎస్
  • అయినా ఆర్థిక సంయమనం పాటిస్తున్న రేవంత్ రెడ్డి
  • ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని ఆర్థిక శాఖకు రేవంత్ కీలక ఆదేశాలు

Congress government deside to decrease debts for finalnce discipline :
ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే సామెత చందాన ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మూడు నెలలకే పార్లమెంట్ ఎన్నికలు రావడం దానితో పథకాలు అన్నీ కోడ్ పుణ్యమా అని నిలిచిపోయాయి. ఇక పాలన గాడిలో పెట్టే పనిలో రేవంత్ సర్కార్ ఉంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ముందు ఉన్న అతి పెద్ద సమస్య రుణ మాఫీ. ఆ తర్వాత ఆరు హామీలు నెరవేర్చేందుకు సమకూరవలసిన డబ్బు. ఇవన్నీ పక్కనపెడితే గత పదేళ్లుగా బీఆర్ఎస్ చేసిన అప్పులు కాంగ్రెస్ కు తిప్పలుగా తయారవుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం అప్పులు, జీతాల చెల్లింపులకే పోతోంది. కేసీఆర్ సర్కార్ చేసిన అప్పులకు నెల నెలా వడ్డీలు కట్టవలసిన దుస్థితి ఏర్పడింది. యావరేజ్ న చూస్తే రోజుకు రూ.207 కోట్లు కేవలం వడ్డీల రూపంలో చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితిలో సంక్షే పథకాలను అమలు చేసేదెలా? అన్నదే రేవంత్ సర్కార్ ను వేధిస్తున్న సమస్య,

కొత్తగా అప్పులు చేయొద్దు

అందుకే రేవంత్ సర్కార్ కేలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా అప్పులు ఇష్టారీతిన చేయొద్దనే నిర్ణయం తీసుకుంది. నెలకు కేవలం తెచ్చిన అప్పులకు కట్టే వడ్డీ రూ.6 వేల కోట్లకు పైగానే అని స్టేట్ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అధికారులు చెబుతున్నారు. ఒక పక్క బీఆర్ఎస్ చేసిన అప్పులు ఎలాగోలా తిప్పలు పడి కడుతుంటే పదే పదే బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ సర్కార్ ను రెచ్చగొట్టి ఇరుకున పెడుతున్నారు. రుణమాఫీ డెడ్ లైన్ అందులో భాగమే. ఇలాంటి డెడ్ లైన్స్ రెచ్చగొట్టి పెట్టించడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఊపిరి సలపకుండా చేయడమే అని రాజకీయ విమర్శకులు సైతం బీఆర్ఎస్ ఎత్తుగడలను ఎండగడుతున్నారు. ఇప్పటి దాకా రేవంత్ సర్కార్ ప్రయోపయోగ నిర్మాణాలు, పథకాలు తదితర పనులకు గాను దాదాపు రూ.7 వేల కోట్ల మూలధన వ్యయంగా ఖర్చు చేసింది.

ఆర్థిక క్రమశిక్షణ

గత సర్కార్ ఇష్టారీతిన చేసినట్లుగా గాక ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని రేవంత్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక శాఖకు సూచనలు ఇచ్చారని తెలుస్తోంది. బడ్జెట్ లిమిట్స్ కు లోబడి మార్కెట్ రుణాలు తీసుకుని బడ్జెట్, ప్రణాళికేతర ఖర్చులకు సరిపడేలా సర్ధుబాటు విధానాన్ని రేవంత్ సర్కార్ పాటిస్తోంది. పైగా గతంతో పోలిస్తే ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆరంభంలోనే అప్పులు తగ్గుముఖం పట్టేలా చేశారు రేవంత్  . గతంతో పోలిస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగినందున రుణాలు తీసుకునే పరిధి పెరిగింది. జీఎస్డీపీ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం తక్కువ అప్పులు చేయటం కొత్త మార్పునకు సంకేతం. సాధారణంగా ప్రభుత్వాలు తాము చేసే రీపేమెంట్ల కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటాయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం కంటే ఎక్కువ వడ్డీలు చెల్లించింది. తెచ్చిన అప్పుల కంటే తిరిగి చెల్లింపులు చేసింది ఎక్కువగా ఉండటం రేవంత్​ సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతోంది.

ఠంచన్ గా ఉద్యోగుల జీతాలు

. గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకకాలంలో రూ.31 వేల కోట్ల రైతు రుణాల మాఫీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం బృహత్తర నిర్ణయం తీసుకుంది. మహిళా స్వయం సహాయక సంఘాల బలోపేతానికి ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు.. భారీ నిధులతో కూడుకున్న పనులే. వీటన్నింటికీ మించి ప్రతి నెలా మొదటి అయిదు రోజుల్లోనే ఉద్యోగులకు జీతాలను పంపిణీ చేసే ప్రక్రియను పునరుద్ధరించిన తీరు రేవంత్ సర్కారు ఆర్థిక క్రమశిక్షణకు సాక్ష్యం.
. గత ప్రభుత్వం బడ్జెట్లో చూపించకుండా గుట్టుగా లోన్లు తెచ్చినట్లు కాకుండా.. రిజర్వు బ్యాంకు నుంచే బహిరంగంగానే మార్కెట్ రుణాలు తీసుకుంది. వీటిలో ఒక్క రూపాయి కూడా నిరర్థకంగా ఖర్చు చేయలేదు. తెలంగాణ ప్రజలపై మోపిన రుణభారం తగ్గించుకుంటూ వస్తోంది. . కాగా ఇప్పటిదాకా తెచ్చిన అప్పులన్నీ 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో రూ. 59 వేల 625 కోట్ల కేటాయింపులనుంచే కావడం గమనార్హం. ఇదే విషయాన్ని అసెంబ్లీలో సైతం ప్రకటిచింది కాంగ్రెస్ సర్కార్.

Publisher : Swetcha Daily

Latest

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Don't miss

Minister: అమాత్యయోగం ఎవరికో?

- త్వరలో మంత్రివర్గ విస్తరణ - ఉత్కంఠలో ఆశావహులు - ఆషాడానికి ముందే మహూర్తం? -...

Survey: చదువుల కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారుగా..!

Indian Weddings: మన దేశంలో పిల్లల చదువుల కంటే.. వారి పెళ్లికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం -...

Job Calender: త్వరలో జాబ్ క్యాలెండర్

- అమలు చేయడానికి ప్రభుత్వం కసరత్తు - కొలువుల జాతర కొనసాగుతుంది - కాంగ్రెస్...

PM Narendra Modi: అబద్ధాల్లో మోదీని మించారే..

- కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై కూనంనేని ఫైర్ - ‘సింగరేణి ప్రైవేటుపరం చేయడానికి...

Criminal Law: కొత్త పోలీసు చట్టాలు

- దేశవ్యాప్తంగా అమలుకు రంగం సిద్ధం - కేసుల సత్వర విచారణే లక్ష్యం - కొత్త చట్టాల ప్రకారమే కొత్త కేసుల విచారణ - పోలీసు శాఖ కంప్యూటర్లలోనూ మార్పులు - కొత్త మార్పులపై పెదవి విరుస్తున్న న్యాయ...

Telangana: బీటీపీఎస్ లో పిడుగుపాటు

భద్రాద్రి పవర్ ప్లాంట్ ఆవరణలో దుర్ఘటన రూ.150 కోట్ల నుంచి రూ.300 కోట్లకు పైగా డ్యామేజీ? ఘటనా స్థలంలో కార్మికులెవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణనష్టం లైట్నింగ్​ పనితీరుపై ఉద్యోగుల్లో అనుమానాలు మంటలను...

Telangana: తీరు మారని ‘కాసు’పత్రులు

(జులై 1) నేడు జాతీయ వైద్యుల దినోత్సవం Private Doctors Persecution from poor patients..today National Doctors day అమ్మానాన్నలు పిల్లలకు జన్మనిస్తే ఆపదకాలంలో వైద్యులు మనకు పునర్జన్మను ఇస్తారు. ఒకప్పటి దశాబ్దాల కలరా...