Chandrababu : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని భారత ఒలింపిక్స్ సంఘం అధ్యక్షురాలు అయిన పీటీ ఉష (Pt Usha) కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు చాలా విషయాలపై పీటీ ఉషతో చర్చించారు. 2029లో జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం ఏపీకి ఇవ్వాలని కోరినట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. పీటీ ఉషతో చర్చించిన విషయాలను ట్విట్టర్ లో పోస్టు చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆప్ ఇండియా ప్రాంతీయ కేంద్రంగా ఏపీకి హోదా తీసుకొచ్చేందుకు ఆమె సపోర్టు కోరినట్టు వివరించారు.
అమరావతిలో నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స లెన్స్ తో పాటు స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి కోసం ఆమె మద్దతు కోరినట్టు వివరించారు. యువ క్రీడాకారులకు అన్ని విధాలుగా సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుందంటూ ఆయన రాసుకొచ్చారు.