Deputy CM Pawan Kalyan(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Deputy CM Pawan Kalyan: కండను కరిగించడమే నిజమైన శ్రమ.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..

Deputy CM Pawan Kalyan: జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా పంచాయితీరాజ్ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. శ్రామికుల కష్టం, నైపుణ్యాన్ని అర్దం చేసుకున్న వ్యక్తిగా, ఇకపై వారిని కూలీలు అని పిలవొద్దని, చెమటోడ్చి దేశాన్ని నిర్మాణం చేసే ఉపాధి శ్రామికులు అని పిలవాలని అన్నారు.

డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ అనేది కాకుండా ప్రతీ వృత్తి గొప్పదే అని అన్నారు. నేను రెగ్యులర్ చదువులు చదువుకోలేదు కాబట్టి నాకు ఏ ఉద్యోగం చేయాలో అర్థం అయ్యేది కాదని అన్నారు. 20 ఏళ్ల వయసులో తాను గాజు బొమ్మలా పెరిగానని, బయటికెళ్లి పని చేద్దాం అంటే తన ఫ్యామిలీ పంపించే వారు కాదన్నారు. పనైనా ఇవ్వండి లేదా బయటికైనా వెళ్లనివ్వండి అని ఎలాగోలా బెంగళూరు నర్సరీలో పనికి వెళ్దాం అనుకున్నప్పుడు మావాళ్లు ఆపి ఇంటికి తీసుకొచ్చారన్నారు.

Also read: BJP Fires on CM Revanth: రేవంత్ లో కాంగ్రెస్ డీఎన్ఏ లేదు.. బీసీలపై ఆ పార్టీది మెుసలి కన్నీరు.. బీజేపీ నేతల ఫైర్

కండను కరిగించడమే నిజమైన శ్రమ అన్నారు. మీ అందరి సహకారంతోటే రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందన్నారు. మీకు మంచి చేయడం అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. పంచాయితీ రాజ్ శాఖ తీసుకోవడం వెనుక ఓట్లు కానీ, ఎన్నికలు కానీ లేవని అన్నారు. దేవుడి దీవెనలతో, అందరి సహకారంతో ప్రభుత్వాన్ని నడిపించుకోగలుగుతున్నామని అన్నారు.

Just In

01

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు