Janasena vs TDP: పిఠాపురంలో రచ్చ రచ్చ..
Janasena vs TDP(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Janasena vs TDP: పిఠాపురంలో రచ్చ రచ్చ.. ఆ పార్టీ నేతలపై కేసులు.. కొలిక్కి వచ్చేనా?

Janasena vs TDP: జనసేన ఎమ్మెల్సీ నాగబాబు పిఠాపురం పర్యటన రచ్చ రచ్చగా మారింది. టీడీపీ- జనసేనల మధ్య వివాదం బట్టబయలైంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా మెగాబ్రదర్ విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే ఈ రెండ్రోజుల పర్యటనలోనూ టీడీపీ, జనసేన కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడం, ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇవన్నీ ఒకెత్తయితే ఈ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ హాజరుకాలేదు.

ఆయనకు కనీసం పిలుపు రాకపోవడంతో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఫైర్ అయ్యారు. కుమారపురం గ్రామంలో రోడ్డు ప్రారంభోత్సవానికి వచ్చిన నాగబాబును అడ్డుకుని, టీడీపీ కార్యకర్తలు ‘జై వర్మ.. జై తెలుగుదేశం’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జనసేన నేతలపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు.

Also read: Nara Lokesh: ‘నేనున్నా.. మిమ్మల్ని టచ్ చేయలేరు’.. మహిళకు లోకేష్ భరోసా

ఈ విమర్శలు, బలప్రదర్శన వాగ్వాదానికి దారి తీసింది. దీంతో తనను దూషించారని జనసేన నేత ఫిర్యాదుతో చినజగ్గంపేటకు చెందిన టీడీపీ నేతలపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను అదుపులోనికి తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ కేసుల వ్యవహారంపై టీడీపీ నేతలు, వర్మ గుర్రుగా ఉన్నారని తెలిసింది. దీనిపై ఇంతవరకూ స్పందించనప్పటికీ, ఎలా ముందుకెళ్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?