Ys Jagan: రాష్ట్ర సమస్యలపై పార్లమెంటు(Parliament) ఉభయ సభల్లో పార్టీ ఎంపీ(MP)లు గట్టిగా గళం వినిపించాలని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశించారు. ఈనెల 10 నుంచి పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ లోక్సభ(Lok sabha), రాజ్యసభ(Rajya sabha) సభ్యులతో జగన్(Ys jagan) క్యాంప్ ఆఫీస్లో సమావేశమయ్యారు. ఉభయ సభల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రస్తావించాల్సిన అంశాలపై పార్టీ(Ycp) ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాల్సిన అంశాలపై ఈ సందర్భంగా సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. రాష్ట్రానికి జీవనాడి పోలవరం(Polavaram) ప్రాజెక్టు నిర్మాణంలో ఎత్తు ఎంతో కీలకమని, అలాంటి ప్రాజెక్టు ఎత్తు తగ్గింపు అనేది రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర విఘాతం అన్నారు. కేంద్ర క్యాబినెట్లో ఇద్దరు టీడీపీ(TDP) మంత్రులు ఉన్నా, వారు పోలవరం ఎత్తు తగ్గింపుపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించక పోవడం దారుణమని జగన్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో రాజకీయాలకు అతీతంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధమని, అధికార పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని సహా కేంద్రంలో సంబంధిత మంత్రులను కలవాలని కూడా ప్రతిపాదించామని, కానీ టీడీపీ ఎంపీలు ముందుకు రాలేదని వారు వెల్లడించారు. అలాగే ఆంధ్రుల హక్కుగా, ఎన్నో త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ప్లాంట్(Vizag steel Plant)ను ఎలాగైనా కాపాడుకోవాలని, ఆ సంస్థ ప్రైవేటీకరణ జరగకుండా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అధినేత నిర్దేశించారు.
బ్యాలెట్ కోసం ఫైట్..
నియోజకవర్గాల పునర్విభజన(Delimitation)పై రకరకాలుగా చర్చ జరుగుతోందని, దీని వల్ల ఉత్తరాదిలో పెరిగనట్లుగా దక్షిణాదిన సీట్లు పెరగవన్న ప్రచారం సాగుతోందని సమావేశంలో ఎంపీలు వెల్లడించారు. దీనిపై స్పందించిన జగన్, నియోజకవర్గాల పునర్విభజన విషయంలో కేంద్రం నుంచి స్పష్టత వచ్చేలా పార్లమెంటలో ప్రస్తావించాలని సూచించారు. ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’(One nation one Election)పై ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉందని గుర్తు చేసిన ఎంపీలు, ఒకేసారి కేంద్రం, రాష్ట్రంలో జరిగే ఎన్నికలు పెద్దగా ప్రభావం చూపకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన జగన్ కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే, ఈవీఎం(EVM)లు కాకుండా బ్యాలెట్(Ballot) విధానంలో ఎన్నికల కోసం డిమాండ్ చేయాలని నిర్దేశించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో ఈవీఎంలతో పోలింగ్ నిర్వహించిన దేశాలు కూడా, ఆ తర్వాత బ్యాలెట్ విధానానికి మళ్లిన విషయాన్ని అధినేత గుర్తుచేశారు. నిరుపేదలకు వైద్య విద్యను మరింత అందుబాటులోకి తెచ్చేందుకు వైసీపీ ప్రభుత్వంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం మొదలు పెట్టగా, వాటిలో పూర్తయిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దిశలో చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సమావేశంలో ఎంపీలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య రంగంపై సీఎం చంద్రబాబు కత్తికట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని ఎంపీలు ప్రస్తావించగా, ఈ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావించాలని జగన్ ఆదేశించారు.
భద్రతపై గట్టిగానే..
జగన్ భద్రత(Security) విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిని తీవ్రంగా తప్పు బట్టిన ఎంపీలు.. మాజీ ముఖ్యమంత్రిగా, జడ్ ప్లస్(Z plus) కేటగిరీలో ఉన్న నేతకు తగిన భద్రత కల్పించడం లేదని ఆక్షేపించారు. జగన్ గుంటూరు మిర్చి యార్డు సందర్శన సమయంలో, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. ఈ విషయాన్ని కూడా పార్లమెంటులో గట్టిగా లేవనెత్తుతామని ఎంపీలు వెల్లడించారు. సమావేశంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూజారాణి, పిల్లి సుభాష్చంద్రబోస్, గొల్ల బాబూరావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, రఘునాథరెడ్డి పాల్గొన్నారు.