Group -2
ఆంధ్రప్రదేశ్

Group -2 : నిముషం ఆలస్యంగా వచ్చిన దివ్యాంగుడు.. అనుమతించాలని భార్య ఆవేదన..!

Group -2 : ఏపీలో జరుగుతున్న గ్రూప్–2 మెయిన్స్ ఎగ్జామ్ లో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా నిముషం ఆలస్యంగా వచ్చినా సరే పరీక్ష( exam) రాసేందుకు అధికారులు అనుమతించరు. అయితే విజయవాడ నలంద విద్యానికేతన్ ఎగ్జామ్ సెంటర్ కు ఒక దివ్యాంగుడు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చాడు. దీంతో తన భర్త దివ్యాంగుడు కావడం వల్ల ఆలస్యం అయిందని.. లోపలికి అనుమతించాలని అతని భార్య అధికారులను వేడుకుంది.

దాంతో అధికారులు అతనిని లోపలికి అనుమతిచ్చాడు. అతను దివ్యాంగుడు కావడం వల్లే అనుమతించామని అధికారులు చెప్పారు. అధికారుల తీరుపై స్థానికంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక చాలా చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. కోవూరు మండలం గంగవరం పరీక్షా కేంద్రానికి ఒక అభ్యర్థి ఇలాగే ఆలస్యంగా రావడంతో అతన్ని అధికారులు వెనక్కు పంపించేశారు. దాంతో అతను ఏడ్చుకుంటూ వెనుదిరిగాడు. అటు బెజవాడ స్టెల్లా కాలేజీకి కూడా ఒక అభ్యర్థి ఆలస్యంగా వస్తే అధికారులు అనుమతించలేదు.

 

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?