Sri Rama Navami: కోదండరాముడికి కళ్లు చెదిరే కానుక.. ఏమిటంటే?
Sri Rama Navami(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Sri Rama Navami: కోదండరాముడికి కళ్లు చెదిరే కానుక.. ఏమిటంటే?

Sri Rama Navami: ఒంటిమిట్ట కోదండ రాముడు శుక్రవారం అంగరంగవైభవంగా, కన్నుల పండువగా కల్యాణం జరుపుకున్న వేళ ఆయనకు మూడు స్వర్ణ కిరీటాలు విరాళాలుగా అందాయి. పెన్నా సిమెంట్స్ అధినేత ప్రతాప్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ఈ కిరీటాలను శుక్రవారం దేవాలయానికి అందించారు. సుమారు 7 కేజీల పసిడితో తయారు చేసిన కిరీటాలను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావుకు అందజేశారు

ప్రత్యేక పూజల అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణులకు కిరీటాలను అలంకరించారు. వజ్రాలు పొదిగిన ఈ కిరీటాల విలువ దాదాపుగా రూ.6.60 కోట్లు ఉంటుంది. కాగా, ఒంటిమిట్టలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నభూతో నభవిష్యతి అన్నరీతిలో కల్యాణోత్సవం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కల్యాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు ముఖ్యఅతిథులుగా హాజరయ్యి పట్టువస్తాలను సమర్పించారు.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

 

 

Just In

01

Messi India Visit: మెస్సీ భారత్‌కు ప్రయాణించిన విమానం గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారేమో!

Telangana DGP: ఉప్పల్‌లో సీఎం – మెస్సీ మ్యాచ్.. కీలక సూచనలు చేసిన డీజీపీ శివధర్ రెడ్డి

Tech Layoffs 2025: 2025లో టెక్ రంగంలో భారీ ఉద్యోగ కోతలు.. లక్షకు పైగా ఉద్యోగాలు తొలగింపు

Kishan Reddy: కోల్ సేతు విండోకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ఇక విదేశాలకు చెక్ పడేనా..!

Messi Hyderabad Visit: కోల్‌కత్తా ఎఫెక్ట్.. హైదరాబాద్‌లో హై అలర్ట్.. మెస్సీ కోసం భారీ భద్రత