Madhavi Latha and JC Prabhakar Reddy
ఆంధ్రప్రదేశ్

JC Prabhakar Reddy: నటి మాధవీలతపై అసభ్యకర వ్యాఖ్యలు… జేసీపై కేసు నమోదు

JC Prabhakar Reddy: టీడీపీ నేత, తాడిపత్రి మునిసిపల్​ చైర్మన్​ జేసీ ప్రభాకర్​ రెడ్డిపై సైబరాబాద్​ సైబర్​ క్రైమ్​ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. సినీ నటీ, బీజేపీ నాయకురాలు మాధవీలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారు ఈ చర్యలు తీసుకున్నారు. దాదాపు నెల రోజుల క్రితం మాధవీలతకు, జేసీకి మధ్య చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.

నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా గత ఏడాది డిసెంబర్​ 31న తాడిపత్రిలోని మహిళల కోసం ప్రభాకర్​ రెడ్డి ప్రత్యేకంగా ఈవెంట్​ ను నిర్వహించారు. దీన్ని మాధవీలత తప్పుబట్టారు. తాడిపత్రి వంటి సున్నిత ప్రాంతంలో అర్ధరాత్రి వరకు ఇలాంటి వేడుకలు నిర్వహించడం మంచిది కాదని విమర్శించారు. దీనిపై స్పందించిన జేసీ… మాధవీలతపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆమె మూవీ ఆర్టిస్ట్​ అసొసియేషన్ తో పాటు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.

తనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకపోతే న్యాయపోరాటం చేస్తానని హెచ్చరించారు. అనంతరం ఈ వివాదం పై స్పందించిన జేసీ… క్షమాపణలు చెప్పారు. తాను ఆవేశంలో మాట్లాడానని అలా చేసి ఉండకూడదని పేర్కొన్నారు. అయినప్పటికీ జేసీ వర్గీయులు సోషల్​ మీడియాలో తనను వేధింపులకు గురి చేస్తుండటం తో పాటు బెదిరింపు కాల్స్​ చేస్తున్నారంటూ తాజాగా మాధవీలత సైబర్​ క్రైమ్​ పోలీసుల్ని ఆశ్రయించారు.

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు