Case on Minister Son: మంత్రి సంధ్యరాణి కొడుకుపై కేసు.. కారణం
Sandhya-Rani (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Case on Minister Son: మంత్రి సంధ్యరాణి కొడుకు, పీఏలపై కేసు.. పార్వతీపురం ఎస్పీ కీలక ఆదేశాలు

Case on Minister Son: కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న గుమ్మడి సంధ్యరాణి కొడుకు పృథ్వీపై కేసు నమోదయింది. మంత్రి పీఏ సతీష్‌పై కూడా సాలూరు పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామంటూ పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేయడంతో పాటు, తనను వేధింపులకు గురి చేశారంటూ ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై పార్వతీపురం మన్యం ఎస్పీ స్పందించారు. త్వరితగతిన విచారణ చేపట్టాలంటూ సాలూరు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

పీఏ సతీష్ రాజీనామా

జాబ్ ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేయడంతో పాటు వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మంత్రికి తన రిజైన్ లెటర్ పంపించారు. కాగా, కారుణ్య నియామకాల విషయంలో తనను సతీశ్ వేధింపులకు గురిచేశాడని, ఈ వ్యవహారంపై మంత్రి గుమ్మడి సంధ్యారాణికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందనా లేదంటూ బాధిత మహిళ చెబుతోంది. ఈ క్రమంలోనే పీఏ సతీష్ రాజీనామా చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు, మంత్రి సంధ్యారాణి కొడుకు పృథ్వీపై వేధింపుల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఫిర్యాదు చేసిన మహిళ, పృథ్వీ మధ్య జరిగిన చాటింగ్ ఇదేనంటూ కొన్ని స్క్రీన్‌షాట్లు సోషల్ మీడియా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

Read Also- Etela Rajender: కాంగ్రెస్ పాలనపై గ్రామాల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత నెలకొంది : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

 

Just In

01

Maoists surrender: వనం నుంచి జనంలోకి.. నలుగురు మావోయిస్టులు లొంగుబాటు!

Allu Arjun: తమిళ దర్శకులు అల్లు అర్జున్ కోసం ఎందుకు క్యూ కడుతున్నారు?.. రీజన్ ఇదే..

Medaram Jatara 2026: మేడారంలో భారీగా ట్రాఫిక్ జామ్.. కట్టలు తెంచుకుంటున్న భక్తుల ఆగ్రహం!

Municipal Elections: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికలు టెన్షన్ .. ఈ ఫలితాలే రాజకీయ దిశను నిర్ణయిస్తాయా?

BRS Party: మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరి పోరు.. పొత్తులు లేకుండా గెలుపు సాధ్యమా?