AP ECET Schedule: జేఎన్టీయూ ఆధ్వర్యంలో ఏపీ ఈసెట్ 2025 పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు. రెండు విడతలుగా ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ వైస్ ఛాన్స్లర్ మాట్లాడుతూ ఏపీ ఈసెట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, మే 6వ తేదీన ఉదయం 9 గంటల నుంచి 12:00 వరకు.. మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
హైదరాబాద్తో కలిపి మొత్తం 100 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. మొత్తం ఈ పరీక్షకు 35,187 మంది విద్యార్థులు పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. పరీక్షా కేంద్రానికి గంటన్నర ముందే విద్యార్థులు చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడరని తెలిపారు.
Mobile Tips In Summer: సమ్మర్ లో అలా చేస్తున్నారా? మీ మెుబైల్ ఢమాలే!
క్యాలి క్యులేటర్, మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచ్, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించబడవని విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మే 17వ తేదీన జేఎన్టీయూ 14వ స్నాతకోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు.