AP CM Chandrababu Naidu: ఏపీ తరపున నోబెల్ తెస్తే రూ. 100 కోట్లు
AP CM Chandrababu Naidu (Image Source: X)
ఆంధ్రప్రదేశ్

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

AP CM Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరైనా మేధావి ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి (Nobel Prize) సాధిస్తే, వారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున అక్షరాలా రూ. 100 కోట్ల నగదు బహుమతి అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ప్రకటించారు. 2017లోనే ఆయన ఈ సవాల్ విసిరారు. అప్పట్లో తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగిన నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ (జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్) ప్రారంభోత్సవంలో ఆయన ఈ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన అదే మాట చెప్పారు. మంగళవారం అమరావతిలో వేలాది టెక్ విద్యార్థులతో ఆన్‌‌లైన్‌లో ‘క్వాంటమ్ టాక్’ (Quantum Talk Amaravati) నిర్వహించిన సీఎం చంద్రబాబు.. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరైనా నోబెల్ బహుమతిని సాధిస్తే.. వారికి రూ. 100 కోట్ల రివార్డ్ అందిస్తానని అన్నారు. గతంలోనే ఈ మాట చెప్పాను. ఇప్పుడు మరోసారి చెబుతున్నానని అన్నారు.

Also Read- The Rise Of Ashoka: ‘ది రైజ్ ఆఫ్ అశోక’ నుంచి వచ్చిన రొమాంటిక్ మెలోడీ ఎలా ఉందంటే?

ఇకపై అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి..

‘క్వాంటమ్‌కు చెందిన ఎంతోమంది నోబెల్ బహుమతిని తీసుకున్నారు. ఇక్కడి యంగ్ బ్రెయిన్స్, మేధావి వర్గం, ఐటీ ప్రొఫెషనల్స్ ఎందుకు ట్రై చేయకూడదని నేను అడుగుతున్నాను. మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రయత్నించండి. మీకు కావాల్సిన అన్ని సౌకర్యాలను మేము అందిస్తాం. ఆ స్థాయికి మేము ప్రీపేర్ చేస్తాం. నోబెల్ వస్తే రూ. 100 కోట్లు ఇస్తాము. అది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది నా కోరిక’ అని చంద్రబాబు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘క్యుబిట్, వైసర్ సంస్థలతో కలిసి ప్రభుత్వం వేలాది టెక్ విద్యార్థులతో ఆన్ లైన్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో నా విజన్ చెప్పాను. పాతిక, ముప్పై ఏళ్ళ క్రితం ఐటీ గురించిన చెప్పిన నేను ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నాను. నిన్నటి వరకు ఎవరికి ఏ వినూత్నమైన ఆలోచన వచ్చినా సిలికాన్ వ్యాలీకి వెళ్లి దాన్ని సాకారం చేసుకునేవారు. కానీ ఇకపై ప్రపంచంలోని వారంతా అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీకి రానున్నారు’ అని చెప్పారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Actor Sivaji: నటుడు శివాజీపై మహిళా కమిషన్​ సీరియస్.. చర్యలు తప్పవ్!

Aadi Sai Kumar: ‘శంబాల’ ఉందా? లేదా? అనేది తెలీదు కానీ, ‘కల్కీ’ తర్వాత ఆ పేరు వైరలైంది

AP CM Chandrababu Naidu: ఏపీ నుంచి ఎవరైనా నోబెల్ సాధిస్తే.. వారికి రూ. 100 కోట్లు ఇస్తా! మళ్లీ అదే సవాల్!

Ramchander Rao: ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధ్యయన కమిటీ వేస్తాం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు

Uttam Kumar Reddy: పదేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేశారా? తీవ్రస్థాయిలో మండిపడ్డ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!