Group -2 : | నిముషం ఆలస్యంగా వచ్చిన దివ్యాంగుడు.. అనుమతించాలని భార్య ఆవేదన..!
Group -2
ఆంధ్రప్రదేశ్

Group -2 : నిముషం ఆలస్యంగా వచ్చిన దివ్యాంగుడు.. అనుమతించాలని భార్య ఆవేదన..!

Group -2 : ఏపీలో జరుగుతున్న గ్రూప్–2 మెయిన్స్ ఎగ్జామ్ లో హృదయాన్ని హత్తుకునే ఘటన చోటు చేసుకుంది. సాధారణంగా నిముషం ఆలస్యంగా వచ్చినా సరే పరీక్ష( exam) రాసేందుకు అధికారులు అనుమతించరు. అయితే విజయవాడ నలంద విద్యానికేతన్ ఎగ్జామ్ సెంటర్ కు ఒక దివ్యాంగుడు ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చాడు. దీంతో తన భర్త దివ్యాంగుడు కావడం వల్ల ఆలస్యం అయిందని.. లోపలికి అనుమతించాలని అతని భార్య అధికారులను వేడుకుంది.

దాంతో అధికారులు అతనిని లోపలికి అనుమతిచ్చాడు. అతను దివ్యాంగుడు కావడం వల్లే అనుమతించామని అధికారులు చెప్పారు. అధికారుల తీరుపై స్థానికంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇక చాలా చోట్ల అభ్యర్థులు ఆలస్యంగా రావడంతో వారిని అధికారులు లోపలికి అనుమతించలేదు. కోవూరు మండలం గంగవరం పరీక్షా కేంద్రానికి ఒక అభ్యర్థి ఇలాగే ఆలస్యంగా రావడంతో అతన్ని అధికారులు వెనక్కు పంపించేశారు. దాంతో అతను ఏడ్చుకుంటూ వెనుదిరిగాడు. అటు బెజవాడ స్టెల్లా కాలేజీకి కూడా ఒక అభ్యర్థి ఆలస్యంగా వస్తే అధికారులు అనుమతించలేదు.

 

Just In

01

Viral Video: రూ.70 లక్షల బాణాసంచా.. గ్రాండ్ డెకరేషన్.. ఎమ్మెల్యే కొడుకు పెళ్లి వైరల్!

Aadi Srinivas Slams KTR: కేవలం 175 ఓట్ల తేడాతో 2009లో గెలిచావ్.. కేటీఆర్ కామెంట్స్‌కు ఆది స్ట్రాంగ్ కౌంటర్!

Fake Death Scam: హోమ్ లోన్ తీర్చేందుకు నకిలీ మరణం.. ప్రేయసి చాట్స్‌తో బయటపడ్డ మోసం

Hydra: ప్రజావాణికి 46 ఫిర్యాదులు.. కబ్జాలపైనే ఎక్కువగా ఆర్జీలు!

UN Security Council: స్నేహంతో సింధూ నీరు ఇస్తే.. యుద్ధాలు, ఉగ్రదాడులు తిరిగిచ్చింది.. పాక్‌పై భారత్ ఫైర్