Lokesh Kanagaraj: సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించారు. ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుండి, అభిమానుల్లో ముఖ్యంగా కార్తీ ‘ఖైదీ 2’ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్నలు మొదలయ్యాయి. తాజాగా దీనిపై లోకేష్ తాజాగా స్పష్టత ఇచ్చారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో ‘ఖైదీ’ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. అయితే, అల్లు అర్జున్తో భారీ ప్రాజెక్ట్ ఓకే అవ్వడంతో, ‘ఖైదీ 2’ అటకెక్కిందంటూ సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపించాయి. ఈ పుకార్లపై స్పందించిన లోకేష్, తన ప్రాజెక్టుల క్రమం గురించి క్లారిటీ ఇచ్చారు.
Read also-Mrunal Siddhant: మృణాల్ ఠాకూర్ కొత్త బాయ్ ప్రెండ్ ఎవరో తెలుసా?.. పాపం ధనుష్ పరిస్థితి!
లైనప్ ఇలా
ముందుగా ప్లాన్ చేసినట్లుగానే అల్లు అర్జున్తో సినిమా తన తదుపరి ప్రాజెక్ట్ అని ఆయన ధృవీకరించారు. ఇది ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉండబోతోంది. ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ‘ఖైదీ 2’ పనులను ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. అంతే కాకుండా.. తన సినిమాటిక్ యూనివర్స్ను (LCU) ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని, ‘ఖైదీ 2’తో పాటు ‘విక్రమ్ 2’ సూర్య హీరోగా ‘రోలెక్స్’ స్టాండ్ ఎలోన్ సినిమాలు కూడా భవిష్యత్తులో ఉంటాయని స్పష్టం చేశారు.
Read also-Poonam Kaur: పవన్ కళ్యాణ్కు ఆ అర్హత లేదు.. పూనమ్ షాకింగ్ పోస్ట్!
అభిమానులకు హామీ
కేవలం భారీ బడ్జెట్ లేదా రెమ్యూనరేషన్ కోసమే తాను అల్లు అర్జున్ సినిమాను ఎంచుకోలేదని, ఆ కథపై తనకు ఉన్న నమ్మకంతోనే ముందుకు వెళ్తున్నానని ఆయన పేర్కొన్నారు. ‘ఖైదీ’లో ఢిల్లీ పాత్రను మళ్ళీ స్క్రీన్పై చూడాలని ఆశపడే అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదని, ఆ సినిమా ఖచ్చితంగా వస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప 2’ పనుల్లో బిజీగా ఉండగా, లోకేష్ తన స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. వీరిద్దరి కలయికలో వచ్చే సినిమా కోసం అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

