Vehicle Registration: వాహన రిజిస్ట్రేషన్ షోరూంలల్లో ప్రారంభమైంది. కానీ, అగ్రికల్చర్ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్పై మాత్రం స్పష్టత రాలేదు. గత 11 ఏళ్లుగా ఇచ్చిన జీవోనే కొనసాగుతుండటంతో రైతులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతుంది. నాటి జీవో మాత్రం కొందరిపాలిట వరంగా మారింది. రవాణాశాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి జీవోలోని “Owned by him or occupied by him” అనేదానిపై స్పష్టత ఇస్తారా? లేదా? అనేదిచూడాలి.
భూమి లేకపోతే ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చా?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చింది. అందుకు సంబంధించిన 2014 అక్టోబర్ 16న జీవో 9ను జారీ చేసింది. అప్పటి నుంచి అగ్రికల్చర్ ట్రాక్టర్లకు రిజిస్ట్రేషన్లో మినహాయింపు ఇచ్చింది. ట్రాక్టర్ ట్రెలర్ 24 కిలో మీటర్ల పరిధిలో అగ్రికల్చర్కు సంబంధించిన వాటిని రవాణా చేయడానికి అనుమతులు ఇచ్చింది. కానీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలో అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులకు ఎన్ని ఎకరాలు ఉండాలనే నిబంధనను స్పష్టంగా చెప్పలేదు. భూమి లేకపోతే ట్రాక్టర్ కొనుగోలు చేయొచ్చా? కౌలు రైతులు ట్రాక్టర్ కొనుగోలు చేస్తే ట్యాక్స్ మినహాయింపు ఇస్తారా? కొనుగోలు చేస్తే వాటికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఏం అందజేయాలని అనే విషయాలను ప్రభుత్వం పేర్కొన లేదు. భూమికి సంబంధించిన వివరాలు లేకపోయినా అఫిడవిట్ తీసుకోని రిజిస్ట్రేషన్ చేస్తే చాలా మంది కౌలు రైతులకు ఉపయోగ పడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. జీవోలో కేవలం ‘Owned by him or occupied by him’ అని మాత్రమే పేర్కొనబడటం వలన, దీనిని ప్రతి ఒక్కరు తమకు తోచిన విధంగా అన్వయించుకుంటున్నారు.
Also Read: Vehicle Registration: నూతన వాహనాలు కొనేవారికి గుడ్ న్యూస్.. కొత్త విధానాన్ని ప్రారంభించిన సర్కార్..?
రిజిస్ట్రేషన్ సమయంలో కొర్రీలు
అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనుగోలు చేసేవారు రైతులైతే ట్యాక్సీ మినహాయింపు జీవోను గత బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసింది. కానీ, ఈ జీవోలో నిర్దిష్టమైన నిబంధనలు పేర్కొనలేదు. దీంతో రైతు అయినప్పటికీ భూమి లేకుంటే ట్యాక్సీ మినహాయింపు ఉండదని, ఇవ్వడం కుదరదని ఆర్టీవో కార్యాలయంలో అధికారులు నిబంధనలు పెడుతున్నారని సమాచారం. దీంతో కొందరు వ్యక్తులు చేతివాటం, దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీవో సిబ్బందికి వరంగా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. అందుకోసం రేట్ ఫిక్స్ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారనే ప్రచారం జరుగుతుంది. దీంతో అగ్రికల్చర్ ట్రాక్టర్ కొనుగోలు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాకుండా ట్రాక్టర్ ట్రెలర్ కమర్షియల్ అని పేర్కొంటూ దానికి ట్యాక్సీ అంటూ వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఫిట్నెస్, ట్యాక్సీ పేరుతో రేటును ఫిక్స్ చేసి మరీ వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ సమయంలో ఎకరాలను బట్టి రేటు ఫిక్స్
ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ సమయంలో ఎకరాలను బట్టి రేటు నిర్ణయిస్తున్నట్లు సమాచారం. అసలు భూమి లేని రైతులకు ఒక రేటు… భూమి ఉంటే ఒకరేటు అంటూ వసూళ్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. కొన్ని సమయాల్లో రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే నిబంధనల పేరుతో తిప్పుకుంటున్నారని సమాచారం. కేవలం ఇన్సూరెన్స్ మాత్రమే చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఫిట్ నెస్, ట్యాక్స్ అంటూ కమర్షియల్ ట్రాక్టర్లకు వసూలు చేసినట్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై ఉన్నతాధికారులను వివరణ అడిగితే అలాంటి ఏమీ లేదని, వ్యవసాయ ట్రాక్టర్కు ట్యాక్స్ మినహాయింపు ఉందని, ఎవరైనా తీసుకున్నట్లు తెలిస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొంటున్నారు.
షోరూం రిజిస్ట్రేషన్లలోనైనా క్లారిటీ ఇస్తారా?
ఈ నెల 24(శనివారం) నుంచి కొనుగోలు చేసే ద్విచక్రవాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలన్ని షోరూంలల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను రవాణాశాఖ ప్రారంభించింది. ఇక రవాణాశాఖ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే, గత ప్రభుత్వం 2014లో ఇచ్చిన జీవో నెంబర్ 9లో వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అదే జీవోను కొనసాగిస్తారా? మారుస్తారా? అనేది చూడాలి. ఈ జీవోతో రవాణాశాఖలో కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది. రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం ఈ జీవో 9లో మార్పులు చేసి వ్యవసాయ ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కు స్పష్టమైన, నిర్దిష్టమైన అంశాలను పొందుపరచి రిజిస్ట్రేషన్ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. మరి ఆ దిశగా రవాణాశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also Read: Archery Training: గుడ్ న్యూస్.. మహబూబాబాద్లో ఉచిత విలువిద్య శిక్షణ శిబిరం

