Accident
ఆంధ్రప్రదేశ్

Bus Accident | కుంభమేళా వెళ్లిన ఏపీ బస్సుకు ఘోర ప్రమాదం.. స్పాట్ లో ఏడుగురు మృతి..!

Bus Accident | కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న ఏపీ బస్సుకు ఘోర ప్రమాదం జరిగింది. భారీ ట్రక్కు ఢీకొట్టడంతో స్పాట్ లోనే ఏడుగురు మృతి చెందారు. ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లిన బస్సు తిరుగు ప్రయాణంలో.. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన భారీ ట్రక్కు ఢీకొట్టింది. నేషనల్ హైవే–30 మీద సిహరో వద్ద బ్రిడ్జి మీద ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా రెండు ఢీకొనడంతో బస్సు (Bus Accident)  నుజ్జు నుజ్జు అయింది. స్పాట్ లో ఏడుగురు చనిపోగా.. 15 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఘటన జరిగిన వెంటనే జబల్ పూర్ అధికారులు అక్కడకు చేరుకుని సహాయ చర్యలు అందిస్తున్నారు. మృతులు అందరూ ఏపీకి చెందిన వారేనని తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Just In

01

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే